BJP MP Laxman: కాంగ్రెస్ స్క్రిప్టును తండ్రీకొడుకులు చదివారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman: శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ వేదికగా మార్చుకున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు చేశారని ఆయన అన్నారు. తండ్రీ కొడుకు అల్లుడు పోటీపడి మరీ మోడీని విమర్శించారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వేరు కాదన్న ఆయన.. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్టును తండ్రీ, కొడుకులు చదివారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి.. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానిపై చర్చించకుండా.. బీజేపీని విమర్శించడానికే సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు.
Read Also: Video call delivery : త్రీ ఇడియట్స్ సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
తమ వైఫల్యాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. అసలు సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ అవసరమా అని నిలదీశారు. గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించే ధైర్యం కేసీఆర్కు లేదన్నారు. కరోనా సమయంలో పొరుగుదేశాలు ఆర్థికంగా చితికిపోతే.. భారత్లో ప్రధాని మోడీ ఆర్థిక సంక్షోభం లేకుండా చేశారని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సభలో చర్చించే ధైర్యం చేయలేదన్నారు లక్ష్మణ్… అలా చేస్తే గుట్టురట్టు అవుతుందని కాగ్ రిపోర్ట్ కూడా పెట్టలేదని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!