Komati Reddy Venkata Reddy: తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక భేటీ
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అర డజన్ కు చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతారనే సంకేతాలు వస్తూన్న నేపథ్యంలో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Sonia Gandhi: వీడియో: శ్రీనగర్ లో సోనియా గాంధీ బోట్ రైడ్
Also Read
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
అయితే, వేముల వీరేశం పార్టీలోకి వస్తే నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ ఏం చేయాలి.. వేముల వీరేశం టికెట్ ఆశిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలోకి ఆహ్వానించి నకిరేకల్ నుంచి బరిలోకి దింపితే.. ఎలా వ్యవహరించాలి… ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం మండలాల వారిగా కూర్చుని మాట్లాడుకుందాం.. అదే రోజు నిర్ణయం తీసుకుందాం అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి కార్యకర్తలు ఇబ్బందిపడొద్దు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎవరో వస్తున్నారు అనే మాటలు, కథనాలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దు.. మీరు ఎవరి పేరు సూచిస్తే వారిని అభ్యర్థిగా ప్రకటిస్తా.. రేవంత్ ఉచిత విద్యుత్ పై నోరు జారితే.. లాగ్ బుక్ బయట పెట్టింది నష్ట నివారణ చేశాని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని భువనగిరి ఎంపీ అన్నారు. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడం వల్లే కాంగ్రెస్ లోకి వస్తా అంటున్నాడు అని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. పార్టీ విడిచి వెళ్ళని వారు, కబ్జాలకు, బెదిరింపులకు, పాల్పడని వారు కావాలి.. శాంతియుత నకిరేకల్ నియోజకవర్గమే నా లక్ష్యం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
-
AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?