MP K.Laxman : మోడీ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీదర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి భగవంత్ కుభా తరుపున ప్రచారంలో భాగంగా పార్లమెంట్ పరిధిలోని చించోలి తాలూకా కుంచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపి డా. లక్ష్మణ్. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీదర్ పార్లమెంట్ నుండి రెండో సారి గెలిచి మోది అండతో భగవత్ కూభా కేంద్ర మంత్రి అయ్యారని, కేంద్ర మంత్రి అయ్యాక కర్ణాటక తో పాటు తెలుగు వారికి కూడా సేవలు అందించిన వ్యక్తి భగవత్ కూబా అని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలో రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి భగవత్ కూబా.. వ్యవసాయం చేసే కవులు రైతులతో సహా అందరూ లాభ పడేలా సహకారం అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో తెలంగాణ రామగుండంలో ఎరువుల పరిశ్రమను కూచివేసిందని, భగవత్ కూభా ఎరువుల మంత్రిగా నియమితులయ్యాకా తిరిగి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించారని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా..’మూడో సారి బీదర్ పార్లమెంట్ నుండి ఎంపీ బరిలో దిగిన భగవత్ కూభా మరో సారి గెలిచి పార్లమెంట్ కి వెళ్ళబోతున్నారు.. మోడీ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది.. మోడీ గ్యారెంటీ అంటే గ్యారంటీగా జరిగే గ్యారెంటీ.. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయి.. ఒక్క అవినీతి కుంభకోణం కూడా లేకుండా పదేళ్లుగా మోది పరిపాలన కొనసాగింది.. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా మోది పరిపాల చేస్తున్నాడు.. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం పని చేస్తుంది.. కర్ణాటకలో గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టారు.. అధికారం చేపట్టాక గ్యారెంటీల ఊసే లేదు.. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య.. ఓడ దాటాక బోడి మల్లయ్య అన్నట్లుంది కాంగ్రెస్ వ్యవహారం.. అలాగే తెలంగాణలో కూడా అమలుకు వీలు కానీ హామీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మాట్లాడుతున్నారు.. హామీల విషయంలో కాంగ్రెస్ మోకాలుకు బోడి గుండుకు ముడి పెడుతుంది.. గ్యారెంటీల విషయంలో మోది ప్రభుత్వం మాత్రమే గ్యారంటీగా నెరవేరుస్తుంది.. కర్ణాటక ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి బుద్ది చెప్పాలి.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి మన ప్రధాని మోడీ.. మీరు భగవత్ కుబా కు వేసే ప్రతి ఓటు మోది కె వెళ్తుంది.. బీజేపీ కి ఓటు వేసి మోది నీ గెలిపిద్ధాం..’ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?