MP K.Laxman : ఎవరెన్ని కుట్రలు చేసినా మోడీపై ప్రజల దృష్టి మరల్చలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియల్ లా సాగుతుందని, అసలైన నేరస్థులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే.. ఇప్పుడు కాంగ్రెస్ లో బట్టి, ఉత్తం ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, లై డిటెక్టర్ కి మేము సిద్ధం మరి రేవంత్ రెడ్డి సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడన్నారు. కానీ రేవంత్ స్పందించడం లేదన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమా అని కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడని, అప్పుడు కేటీఆర్ కూడా స్పందించ లేదని లక్ష్మణ్ అన్నారు. కేవలం బీజేపీ దృష్టి మరల్చేందుకు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా మోది పై ప్రజల దృష్టి మరల్చలేరని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున లై డిటెక్టర్లను డీఎన్ఏ టెస్ట్ లను మేము ఏర్పాటు చేస్తామని, నిజంగా చిత్త శుద్ది ఉంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ రావాలన్నారు ఎంపీ లక్ష్మణ్.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!