MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ రామ నవమి సందర్భంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన శ్రీ సీతా రాములు కళ్యాణ వేడుకల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీ రామ నవమి వేడుకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత మొదటి శ్రీ రామ నవమి కావడం విశేషమన్నారు. ప్రతి గ్రామంలో అందరూ శ్రీ రాముని కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతా రాముల కళ్యాణం ప్రపంచం మొత్తం వీక్షించడం ఆనవాయితీ అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి ఆ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ ను సాకుగా చూపెట్టి ఈ కుట్ర కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ విషయం పై జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతి తెప్పించానని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి శ్రీ రామ నవమి పండుగ పై ఎందుకు కుట్ర పూరితంగా వ్యవహరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు లక్ష్మణ్. చివరికి ఆకాశవాణి ద్వరా కూడా వినిపించకుండా ఆంక్షలు విధించారని, ఇది అరిష్టంగా మేము భావిస్తున్నామన్నారు. గత ముఖ్యమంత్రి కూడా ఆనవాయితీ కి విరుద్ధంగా వ్యవహరించాడని, గత నలభై ఏళ్ల ఆచారానికి స్వస్తి పలికి అప్పటి ముఖ్యమంత్రి హాజరు కాలేదన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు వారు రాజకీయంగా ఏ రకమైన మూల్యం చెల్లించుకున్నారో చూస్తున్నాని, అలాంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి కూడా వస్తుందన్నారు.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
కచ్చితంగా ఈ రోజు భద్రాద్రి శ్రీ రాముని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది అంటే అది కేవలం బిజెపి సాధించిన విజయమే.. నిన్న డిల్లీ లో జాతీయ ఎన్నికల కమిషన్ తో మాట్లాడి అనుమతి తీసుకువచ్చాం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వీక్షిస్తున్నారు.. అలాగే ముషీరాబాద్ స్ట్రీట్ నంబర్ 4 లో కూడా కులాలకు అందరూ కలిసి జరుపుకున్నారు.. అదే విధంగా ఈరోజు అయోధ్యలో జరిగిన కళ్యాణం విశిష్టత కలిగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!