Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind: కవిత కొత్త పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది అన్నారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు వాళ్లను ఓడించి బీజేపీని గెలిపించారన్నారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అని చెప్పారు. బీజేపీ సపోర్ట్ లేకండానే రాష్ట్రం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఇటీవల ఎంపీ తేజస్వీ యాదవ్ పార్లమెంట్లో తెలంగాణ విభజన అంశంపై మాట్లాడిన తీరును అరవింద్ వివరించారు. ఇండియా- పాకిస్థాన్ ప్రక్రియలో ఎంతో మంది చనిపోయారని.. వీళ్ళు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు కాబట్టే.. అంత మంది చనిపోయారని తేజస్వి అన్నట్లు తెలిపారు. “తేజస్వి మాటలను బీఆర్ఎస్ కళ్ళద్దాలతో చూడకండి. కవికి కేసీఆర్ రజనీకాంత్ల కనపడుతున్నారా..? కేసీఆర్ రోబో అయ్యారా..?” అని ప్రశ్నించారు. మరోవైపు.. కవిత కొత్త పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది.. అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన అందించారని చెప్పారు. “గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటా.. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎన్ని పార్టీలు ఉన్నా బీజేపీకి ఇబ్బంది లేదు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.” అని రామచందర్రావు పేర్కొన్నారు.
READ MORE: Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
Also Read
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుంటే బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. “విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సవాల్ విసురుతున్నా.. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఏపీలో కలిసిన కనీసం 5 గ్రామాలను వెనక్కి వచ్చేలా చూడాలి. భద్రాచలం వద్ద ఉన్న 5 గ్రామాలు పోతే రాముడి గుడి మునుగుతుంది. గ్రామాలను వెనక్కి తీసుకురావడానికి జాగృతి తరఫున కేంద్రానికి లేఖ రాశాం. మూడు పార్టీలపై అలుపెరగని పోరాటానికి కార్యకర్తలంతా సిద్ధం కావాలి’’ అని కవిత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!