Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm: ఫిన్టెక్ దిగ్గజం పేటియంకు భారీ షాక్ తగిలింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం ఆర్బీఐ హైకోర్టును కూడా ఆశ్రయించనుంది.
కస్టమర్ల డబ్బులు సేఫ్గా ఎలా తిరిగిస్తారంటే..
లైసెన్స్ రద్దయిన నేపథ్యంలో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే పేటియం పేమెంట్స్ బ్యాంక్ తన అఫీషియల్ పోర్టల్లో ఒక ప్రకటన విడుదల చేసింది. డిపాజిటర్ల సొమ్ము పూర్తిగా సురక్షితంగా ఉందని సంస్థ తెలిపింది. కస్టమర్లందరికీ డిపాజిట్లను తిరిగి ఇచ్చేందుకు తమ వద్ద సరిపడా నిధులు ఉన్నాయని పేర్కొంది. డబ్బును ఎలా తిరిగి ఇస్తారనే దానిపై పూర్తి వివరాలను, ప్రక్రియను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది. చాలా కాలంగా పేటియం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్బీఐ అసంతృప్తిగా ఉంది. బ్యాంకింగ్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం, బ్యాంక్ యాజమాన్యంపై నమ్మకం కోల్పోవడం, ఖాతాదారుల ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించడంతో తాజాగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలోనే (2022లో) కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2024లో ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం పేటియం ఫాస్టాగ్ సేవలపై కూడా పడింది.
Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఇకపై ఏం చేయలేరా..
లైసెన్స్ రద్దయిన తర్వాత పేటియం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై ‘బ్యాంక్’గా వ్యవహరించలేదు. కొత్త ట్రాన్సాక్షన్స్ జరపడం, బ్యాంకింగ్ సేవలు అందించడం వంటివి పూర్తిగా నిలిచిపోతాయి. ఇక్కడ వినియోగదారులు ఒక విషయాన్ని గమనించాలి. ఆర్బీఐ రద్దు చేసింది ‘పేటియం పేమెంట్స్ బ్యాంక్’ లైసెన్స్ను మాత్రమే. ‘పేటియం యాప్’ యథావిధిగా పనిచేస్తుంది. పేటియం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాము పేటియం పేమెంట్స్ బ్యాంక్ నుంచి వేరుగా ఉన్నామని, యాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!