Bandi Sanjay: రజాకార్ సినిమా చూసిన ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ కూడా చూసి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్లోని మమత థియేటర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘రజాకార్’’ సినిమాను వీక్షించారు. ‘‘రజాకార్’’ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజ్ అర్జున్ (మెయిన్ యాక్టర్), బలగం సంజయ్, గిరి, కాస్ట్యూమ్ డిజైనర్ పూజ(కరీంనగర్) తదితరులు సైతం ఈరోజు బండి సంజయ్ తో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొంతమంది కూహన సెక్యులర్ వాదులు తెలంగాణ చరిత్రని మరుగున పెట్టారని ఆరోపించారు. నిజామే గొప్పవాడని కీర్తిస్తున్నారని తెలిపారు. నిజమైన చరిత్రని సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో తీసిన సినిమా రజాకార్ అని అన్నారు.
Shamshabad Airport: సీఎం వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంట నుంచి అందులోనే..!
Also Read
కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి… అని కోరుతున్నాను. కేసీఆర్ ఒక్కసారి ఈ రజాకార్ సినిమా చూసి నిజాం మంచోడు అని ట్వీట్ చేయాలని బండి సంజయ్ తెలిపారు. నిజాం సమాధి వద్ద మోకరిల్లావు కదా కేసీఆర్.. ఒక్కసారి ఈ సినిమా చూడాలని పేర్కొన్నారు. రజాకార్ వారసత్వ పార్టీ ఎంఐఎంతో కలిసిన వాళ్ళు కేసీఆర్, కాంగ్రెస్ అని విమర్శించారు. చార్మినార్ వద్ద ఈ సినిమా ప్రదర్శించి.. ఒవైసీ బ్రదర్స్ని కట్టేసి ఈ సినిమా చూపెట్టాలని అన్నారు. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల మాదిరిగా రజాకార్ ఫైల్స్ తీయాలని గూడూరు నారాయణరెడ్డి సంకల్పించారన్నారు. అప్పటి ప్రభుత్వం అడ్డంకులు పెట్టినా సినిమాను ఆపలేదని బండి సంజయ్ తెలిపారు.
Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్బోర్డ్..
నిజాం కాలంలో జరిగిన అకృత్యాలు, విధ్వంసం నేటి తరానికి చెప్పేదే రజాకార్ సినిమా అని అన్నారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.. ఈ సినిమాను ప్రోత్సహించాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అవార్డ్ల కోసం తీసిన సినిమా కాదు.. వాస్తవాలను చెప్పే సినిమా అని పేర్కొన్నారు. నిజాంని పొగిడే వాళ్ళని.. సమాధికి మొక్కిన వాళ్ళను కట్టేసి ఈ సినిమా చూపెట్టాలని అన్నారు. మందు తాగే వాళ్ళుంటే ఫుల్ బాటిల్ పెట్టిమరీ ఈ సినిమా వాళ్లకు చూపెట్టాలని తెలిపారు. హిందువులను రాచి రంపాన పెట్టిన వారిని, పొగిడిన వారికి నిజాంకి పట్టిన గతే పట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం రిజర్వేషన్ అని.. మళ్ళీ రజాకార్ రోజులు తేవడానికి పని చేస్తున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినం జరపాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..