lion hiding: అడవికి రాజైనా జనాలను చూసి భయపడాల్సిందే. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాకింగ్ చేస్తున్న మహిళను చూసి సింహం పొదల మాటుకు వెళ్లి దాక్కొంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా అడవి జంతువులు మనుషులు కనిపిస్తే దాడికి దిగుతాయి. కానీ ఈ సింహం మహిళను చూసి దాక్కుంది. దీంతో వీడియో కాస్త వైరల్ అయింది.
ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేసినప్పటి నుంచి 41,000 కంటే ఎక్కువ మంది చూశారు. కాగా 1,900 కంటే ఎక్కువ లైక్లను పొందింది. 300 మందికి పైగా వినియోగదారులు ఈ పోస్ట్ను రీట్వీట్ చేశారు. అనేక మంది వినియోగదారులు పోస్ట్పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా అద్భుతమని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
Read Also: YSR Pension Gift: YSR పింఛను కానుక..అవ్వా తాతలకు వేడుక
సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో జంతువులు, పక్షులు, ముద్దులొలికే చిన్న పిల్లల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతుంటారు. లైకులు, కామెంట్లు చేస్తూ షేర్ చేస్తుంటారు. ఇక కొన్ని వీడియోల్లో యువతీ యువకుల హంగామా, వృద్ధులు చేసే సాహసాలు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి.
అడవి జంతువులు మనుషులు కనిపిస్తే చాలు.. వాటికి ఆహారం దొరికిందనుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేటాడుతుంటాయి. కొన్ని సందర్భాలలో మాత్రమే అవి మనుషులను చూసి బెదురుకుంటాయి. అలాంటి సందర్భాలలో గురైనప్పుడు మాత్రమే అవి ప్రతిస్పందిస్తాయి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. పొదల్లో దాక్కున్న ఆ సింహం జాగింగ్ చేస్తోన్న మహిళని భయపడిపోయిందో ఏమో తెలియదుగానీ, ఆమె చూస్తూ అలాగే ఉండిపోయింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
Read Also: Nia Tripathi: పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికి రెడీ అయ్యిందట!