Sana Don : దొంగతనాలకు తల్లి స్కెచ్.. పిల్లలతో కలిసి చోరీలు.. చివరికి ట్విస్ట్.!
- తల్లి మార్గదర్శకం – పిల్లలను తప్పుదోవ పట్టించిన సనా డాన్!
- దొంగతనాల కోసం ముందుగా రెక్కీ – తర్వాత పిల్లలతో ఆపరేషన్!
- 500కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు – చివరికి ముఠా అరెస్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sana Don : తల్లి డైరెక్షన్ తో పిల్లలు ముందుకు వెళ్తారు. అయితే తల్లి డైరెక్షన్ మంచిది అయితే ఇక్కడ స్టోరీ చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఆ తల్లి ఏకంగా ఒక డాన్.. పిల్లల్ని మంచి దిశగా తీసుకుని అవసరం ఉంది.. కానీ తన పిల్లల్ని కూడా తన దారిలోకి తీసుకొని వచ్చింది.. తల్లి దొంగతనాల కోసం స్కెచ్ వేస్తోంది.. ఆ తర్వాత పిల్లలు వెళ్లి దోచుకుని వస్తారు.. ముగ్గురు పిల్లలు తల్లి కలిసి హైదరాబాదులోని అత్యంత ధనవంతుడు ఉండే ప్రాంతాలను దోచుకుని పోతున్నారు. సనా డాన్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. దాదాపు ఇప్పటివరకు 50 పైగా దొంగతనాలు చేశారు.. ఎక్కడైతే ధనవంతుల ఎన్నో ఉంటాయో ఆ ఏరియాలో తల్లి వెళ్లి ముందుగా రెక్కీ చేస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారం పిల్లలకు చెప్తుంది.. రాత్రికి రాత్రే పిల్లలు వెళ్లి ఇల్లు మొత్తాన్ని గుల్ల చేసుకుని వస్తారు ..ఆ తర్వాత ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారు.
మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా..ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లను గుర్తించడం.. తన కొడుకులను ఆ ఇంటికి పంపించి దొంగతనాలు చేయించడం.. చోరీసొత్తును గుట్టు చప్పుడు కాకుండా అమ్మడమే కాకుండా వారి తరఫున లాయర్లను మాట్లాడి బెయిల్ ఇప్పించడం అలవాటుగా మార్చుకుంది. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనల్లో నిందితురాలిగా ఉన్న కరడుగట్టిన నేరస్థురాలు సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్ తో పాటు ఆమె కొడుకు సోహైల్ ను డైమండ్ హిల్స్ కాలనీలో చోరీ ఘటనలో అరెస్ట్ చేసిన ఫిలిం నగర్ పోలీసులు రిమాండ్ తరలించారు.
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
షేక్పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో ఇటీవల 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 4.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ చోరీ అయ్యింది. బండ్లగూడకు చెందిన సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్, తన ముగ్గురు కుమారులు మహమ్మద్, సాహిల్, సోహైల్తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. దొంగతనం అనంతరం ఆటోలో పారిపోతున్న క్రమంలో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు అనేక ప్లాన్లు వేశారు. చోరీ అనంతరం నేరుగా బండ్లగూడలోని తమ ఇంటికి వెళ్తే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించి.. సుమారు రెండు గంటల పాటు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని బస్తీలోని సందుగొందుల్లో తిరిగారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా పోలీసులు 500కి పైగా సీసీ కెమెరాలను సుమారు 40 గంటల పాటు జల్లెడపట్టి ఎట్టకేలకు బండ్లగూడలోని నిందితుల నివాసాన్ని గుర్తించారు. అయితే పోలీసులు తమ ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని అమ్మేందుకు ప్రయత్నించి సనా బేగం, ఆమె రెండో కొడుకు సోహైల్ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
నిందితురాలు సనా బేగం ను వైద్య పరీక్షల కోసం స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆమె హైడ్రామా చేసినట్లు తెలిసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. తనను అరెస్టు చేసేలా రిపోర్ట్ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు నీదే బాధ్యత అంటూ సదరు వైద్యుడిని దబాయించిందని తెలిసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పలు రకాల వైద్య పరీక్షల అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. సనా బేగంపై దాదాపు 43 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Railway Ticket Discounts: వారందికీ 75% వరకు రైల్వే టికెట్ పై రాయితీ!
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!