Tragedy: విషాదంగా మారిన వివాదం.. తల్లి కోపానికి ఇద్దరు పిల్లలు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు…. కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. భార్యాభర్తలు మరో బిడ్డతో కలిసి మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం
Also Read
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
మాచర్ల మండలం నారాయణపురం తండా చెందిన రవి నాయక్, తన అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.. కాగావృత్తి రీత్యా రవి నాయక్ హైదరాబాద్లో ఆటో నడుపుతున్నారని, వారానికో, పది రోజులకు, వచ్చి కుటుంబంతో గడిపే వారిని సమాచారం. ఈ నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పుట్టింటికి వెళ్తానని చెప్పింది భార్య వసంత. దీన్ని వ్యతిరేకించాడు భర్త రవి నాయక్. దీంతో భర్తతో తీవ్రవాగ్వదానికి దిగింది వసంత. ఆగ్రహం తట్టుకోలేక తాగుతున్న టీలో ఎలుకల మందు కలిపించింది. ఈ ఘటనలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కాగా టీ రుచిలో తేడా రావటంతో టీ తాగిన రవి నాయక్ ఆ టీని పక్కన పడేశాడు. దీంతో రవి నాయక్కు ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్లు చెప్పారు.
Read Also: Indore: మాట్లాడటం లేదని మహిళ ఇంటికి నిప్పు అంటించిన ఓ వ్యక్తి..
అయితే కన్నతల్లి కోపంతో టీలో ఎలుకల మందు కలిపించిందన్న విషయాన్ని తెలుసుకోలేని ఆ చిన్నారులు టీని సేవించడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరటం అక్కడ ఒక్కొక్కరుగా చికిత్స పొందుతూ మృత్యువాత పట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు రమావత్ భాను ప్రకాష్, రమావత్ ఈశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో రెండేళ్ల వయస్సు ఉన్న ఈశ్వర్ మృతిచెందగా, సోమవారం రామావత్ భాను ప్రకాష్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో, మిర్యాలగూడ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. భర్త రవి నాయక్ భార్య వసంతతో పాటు మరొక చిన్నారి ఈశ్వర్ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షణికాలం ఆవేశంతో ఇద్దరు బిడ్డల ఉసురు తీసిన కన్నతల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉందని , క్షణికాల కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కుటుంబాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు మృతుల బంధువులు..
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!