Tragedy: విషాదంగా మారిన వివాదం.. తల్లి కోపానికి ఇద్దరు పిల్లలు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు…. కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. భార్యాభర్తలు మరో బిడ్డతో కలిసి మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
మాచర్ల మండలం నారాయణపురం తండా చెందిన రవి నాయక్, తన అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.. కాగావృత్తి రీత్యా రవి నాయక్ హైదరాబాద్లో ఆటో నడుపుతున్నారని, వారానికో, పది రోజులకు, వచ్చి కుటుంబంతో గడిపే వారిని సమాచారం. ఈ నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పుట్టింటికి వెళ్తానని చెప్పింది భార్య వసంత. దీన్ని వ్యతిరేకించాడు భర్త రవి నాయక్. దీంతో భర్తతో తీవ్రవాగ్వదానికి దిగింది వసంత. ఆగ్రహం తట్టుకోలేక తాగుతున్న టీలో ఎలుకల మందు కలిపించింది. ఈ ఘటనలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కాగా టీ రుచిలో తేడా రావటంతో టీ తాగిన రవి నాయక్ ఆ టీని పక్కన పడేశాడు. దీంతో రవి నాయక్కు ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్లు చెప్పారు.
Read Also: Indore: మాట్లాడటం లేదని మహిళ ఇంటికి నిప్పు అంటించిన ఓ వ్యక్తి..
అయితే కన్నతల్లి కోపంతో టీలో ఎలుకల మందు కలిపించిందన్న విషయాన్ని తెలుసుకోలేని ఆ చిన్నారులు టీని సేవించడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరటం అక్కడ ఒక్కొక్కరుగా చికిత్స పొందుతూ మృత్యువాత పట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు రమావత్ భాను ప్రకాష్, రమావత్ ఈశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో రెండేళ్ల వయస్సు ఉన్న ఈశ్వర్ మృతిచెందగా, సోమవారం రామావత్ భాను ప్రకాష్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో, మిర్యాలగూడ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. భర్త రవి నాయక్ భార్య వసంతతో పాటు మరొక చిన్నారి ఈశ్వర్ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షణికాలం ఆవేశంతో ఇద్దరు బిడ్డల ఉసురు తీసిన కన్నతల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉందని , క్షణికాల కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కుటుంబాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు మృతుల బంధువులు..
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!