Tragedy: విషాదంగా మారిన వివాదం.. తల్లి కోపానికి ఇద్దరు పిల్లలు బలి
Tragedy: కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు…. కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. భార్యాభర్తలు మరో బిడ్డతో కలిసి మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మాచర్ల మండలం నారాయణపురం తండా చెందిన రవి నాయక్, తన అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.. కాగావృత్తి రీత్యా రవి నాయక్ హైదరాబాద్లో ఆటో నడుపుతున్నారని, వారానికో, పది రోజులకు, వచ్చి కుటుంబంతో గడిపే వారిని సమాచారం. ఈ నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పుట్టింటికి వెళ్తానని చెప్పింది భార్య వసంత. దీన్ని వ్యతిరేకించాడు భర్త రవి నాయక్. దీంతో భర్తతో తీవ్రవాగ్వదానికి దిగింది వసంత. ఆగ్రహం తట్టుకోలేక తాగుతున్న టీలో ఎలుకల మందు కలిపించింది. ఈ ఘటనలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కాగా టీ రుచిలో తేడా రావటంతో టీ తాగిన రవి నాయక్ ఆ టీని పక్కన పడేశాడు. దీంతో రవి నాయక్కు ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్లు చెప్పారు.
Read Also: Indore: మాట్లాడటం లేదని మహిళ ఇంటికి నిప్పు అంటించిన ఓ వ్యక్తి..
అయితే కన్నతల్లి కోపంతో టీలో ఎలుకల మందు కలిపించిందన్న విషయాన్ని తెలుసుకోలేని ఆ చిన్నారులు టీని సేవించడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరటం అక్కడ ఒక్కొక్కరుగా చికిత్స పొందుతూ మృత్యువాత పట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు రమావత్ భాను ప్రకాష్, రమావత్ ఈశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో రెండేళ్ల వయస్సు ఉన్న ఈశ్వర్ మృతిచెందగా, సోమవారం రామావత్ భాను ప్రకాష్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో, మిర్యాలగూడ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. భర్త రవి నాయక్ భార్య వసంతతో పాటు మరొక చిన్నారి ఈశ్వర్ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షణికాలం ఆవేశంతో ఇద్దరు బిడ్డల ఉసురు తీసిన కన్నతల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉందని , క్షణికాల కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కుటుంబాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు మృతుల బంధువులు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో