Maharastra : భర్తతో గొడవ.. కూతురిని చంపి శవంతోనే రోడ్లపై తిరిగిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తన మూడేళ్ల పాపను గొంతుకోసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య అనంతరం మహిళ తన కుమార్తె మృతదేహంతో దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డుపై తిరుగుతూనే ఉంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఐడీసీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితురాలు 23 ఏళ్ల ట్వింకిల్ రౌత్, ఆమె భర్త రామ్ లక్ష్మణ్ రౌత్ (24) ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం నాగ్పూర్కు వెళ్లారు. వారు ఒక పేపర్ తయారీ కంపెనీలో పనిచేశారు. ఎంఐడీసీ ప్రాంతంలోని హింగ్నా రోడ్లోని కంపెనీ ప్రాంగణంలో ఒక గదిలో నివసిస్తున్నారని ఒక అధికారి తెలిపారు.
Read Also:Bhadradri Kothagudem: విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
వీరి మధ్య పరస్పర అపనమ్మకం కారణంగా తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. తీవ్ర వాగ్వాదం మధ్య వారి కుమార్తె ఏడవడం ప్రారంభించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహిళ తన కుమార్తెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి చెట్టుకింద గొంతుకోసి హత్య చేసింది. అనంతరం మృతదేహంతో నాలుగు కిలోమీటర్ల మేర నడిచింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భద్రతా సిబ్బందికి జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు. పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారని అధికారి తెలిపారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. అనంతరం మహిళను కోర్టులో హాజరుపరిచామని, అక్కడి నుంచి మే 24 వరకు పోలీసు కస్టడీకి పంపామని అధికారి తెలిపారు.
Read Also:EVM Vandaalism: మాచర్ల సంఘటనపై సీఈసీ సీరియస్.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!