Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Dairy : అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. వంటనూనెల ప్రయోజనాలను సామాన్యులకు అందించాలని కంపెనీలను ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. ఈ జాబితాలో మదర్ డెయిరీ పేరు తెరపైకి వచ్చింది. మదర్ డెయిరీ తన వంటనూనె బ్రాండ్ ‘ధార’ ధరలను వరుసగా రెండో నెలలో తగ్గించింది. ఈ తగ్గింపు లీటరుకు రూ.10. అంటే నెల రోజుల్లోనే లీటర్కు రూ.20 నుంచి 25 వరకు ధర తగ్గింది. దీని వల్ల సామాన్యులకు ద్రవ్యోల్బణం నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది.
Read Also:Chhattisgarh : మధ్యపానం నిషేధించే ధైర్యం నాకు లేదు..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
రూ.10 తగ్గిన చమురు ధర
వచ్చే వారం నుంచి కొత్త ధరలతో ప్యాకింగ్ అందుబాటులోకి వస్తుందని వంటనూనె బ్రాండ్ ‘ధార’ను విక్రయిస్తున్న మదర్ డెయిరీ తెలిపింది. ఈ నూనె ధరలను లీటరుకు రూ.10 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ, ఎన్సిఆర్ ప్రాంతంలో పాల ఉత్పత్తుల సరఫరాదారు అయిన మదర్ డైరీ కూడా ధారా బ్రాండ్లో వంట నూనెలను విక్రయిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ధార బ్రాండ్ ఆయిల్ ధరలను తగ్గించినట్లు తెలిపింది. ధారా ఎడిబుల్ ఆయిల్ అన్ని ఎడిషన్ల గరిష్ట ధరను లీటరుకు రూ.10 వరకు తగ్గిస్తున్నట్లు మదర్ డెయిరీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గడం, దేశీయంగా ఆవాలు వంటి నూనెగింజల పంటల లభ్యత మెరుగుపడటం వంటి కారణాలతో ఈ చర్య తీసుకోబడింది.
Read Also:Tamannah : తమన్నా తీసుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?
వచ్చే వారం నాటికి కొత్త ఎంఆర్పీతో కూడిన ధార బ్రాండ్ వంటనూనె బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని మదర్ డెయిరీ తెలిపింది. ధర తగ్గింపు తర్వాత, ధార శుద్ధి చేసిన కూరగాయల నూనె ఇప్పుడు లీటరు రూ. 200కి పడిపోయింది. అదే విధంగా ధార కాచి ఘనీ మస్టర్డ్ ఆయిల్ ఎంఆర్పి లీటర్కు రూ.160, ధార మస్టర్డ్ ఆయిల్ ఎంఆర్పి రూ.158గా ఉంది. దీంతో ఇకపై ధార శుద్ధి చేసిన కుసుమ నూనె లీటరు రూ.150కి, కొబ్బరినూనె రూ.230కి విక్రయించనున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!