Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Dairy : అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. వంటనూనెల ప్రయోజనాలను సామాన్యులకు అందించాలని కంపెనీలను ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. ఈ జాబితాలో మదర్ డెయిరీ పేరు తెరపైకి వచ్చింది. మదర్ డెయిరీ తన వంటనూనె బ్రాండ్ ‘ధార’ ధరలను వరుసగా రెండో నెలలో తగ్గించింది. ఈ తగ్గింపు లీటరుకు రూ.10. అంటే నెల రోజుల్లోనే లీటర్కు రూ.20 నుంచి 25 వరకు ధర తగ్గింది. దీని వల్ల సామాన్యులకు ద్రవ్యోల్బణం నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది.
Read Also:Chhattisgarh : మధ్యపానం నిషేధించే ధైర్యం నాకు లేదు..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
రూ.10 తగ్గిన చమురు ధర
వచ్చే వారం నుంచి కొత్త ధరలతో ప్యాకింగ్ అందుబాటులోకి వస్తుందని వంటనూనె బ్రాండ్ ‘ధార’ను విక్రయిస్తున్న మదర్ డెయిరీ తెలిపింది. ఈ నూనె ధరలను లీటరుకు రూ.10 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ, ఎన్సిఆర్ ప్రాంతంలో పాల ఉత్పత్తుల సరఫరాదారు అయిన మదర్ డైరీ కూడా ధారా బ్రాండ్లో వంట నూనెలను విక్రయిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ధార బ్రాండ్ ఆయిల్ ధరలను తగ్గించినట్లు తెలిపింది. ధారా ఎడిబుల్ ఆయిల్ అన్ని ఎడిషన్ల గరిష్ట ధరను లీటరుకు రూ.10 వరకు తగ్గిస్తున్నట్లు మదర్ డెయిరీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గడం, దేశీయంగా ఆవాలు వంటి నూనెగింజల పంటల లభ్యత మెరుగుపడటం వంటి కారణాలతో ఈ చర్య తీసుకోబడింది.
Read Also:Tamannah : తమన్నా తీసుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?
వచ్చే వారం నాటికి కొత్త ఎంఆర్పీతో కూడిన ధార బ్రాండ్ వంటనూనె బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని మదర్ డెయిరీ తెలిపింది. ధర తగ్గింపు తర్వాత, ధార శుద్ధి చేసిన కూరగాయల నూనె ఇప్పుడు లీటరు రూ. 200కి పడిపోయింది. అదే విధంగా ధార కాచి ఘనీ మస్టర్డ్ ఆయిల్ ఎంఆర్పి లీటర్కు రూ.160, ధార మస్టర్డ్ ఆయిల్ ఎంఆర్పి రూ.158గా ఉంది. దీంతో ఇకపై ధార శుద్ధి చేసిన కుసుమ నూనె లీటరు రూ.150కి, కొబ్బరినూనె రూ.230కి విక్రయించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!