Palnadu: ఆన్లైన్ ప్రేమాయణం.. ప్రియుడికోసం బరితెగించిన మహిళ.. పిల్లల్ని నడిరోడ్డుపై వదిలేసి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu: భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలను రోడ్డున పడేశాయి.. బరితెగించిన తల్లి ప్రియుడి కోసం పిల్లలను వదిలేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా… చరవాణిలో పరిచయమైన వ్యక్తి కోసం.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను వదిలేసింది ఓ తల్లి. పిల్లల కోసమైనా.. తిరిగి వెళ్లాలని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ససేమీర అంటోంది. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తతో తరుచూ గొడవ పడుతూ ఉండేది. ఇదే సమయంలో తుమ్మలచెరువు గ్రామానికి చెందిన రాజేష్ ఆమెకు ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది. ఆ మహిళ భర్తను వదిలి ఐదు నెలల క్రితం తుమ్మలచెరువులోని రాజేష్ వద్దకు చేరుకుంది. మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామపెద్దల ద్వారా నచ్చజెప్పి పిల్లలతో కలిసి ఉండేలా విజయనగరం పంపించారు. వారం క్రితం మరోసారి ఈ మహిళ మళ్ళీ రాజేష్ వద్దకు చేరుకుంది.
READ MORE: Bihar Assembly Election 2025 Date: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ప్రియుడి కోసం తమనే వదిలేసినట్లు ఆ ముక్క పచ్చలారని చిన్నారులకు తెలియదు కదా..? కుటుంబ సభ్యులతో కలిసి “అమ్మా.. ఎక్కడున్నావ్..” అంటూ ఆ చిన్నారులు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారుల తల్లిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇద్దరు పిల్లలను వదిలి ఇక్కడికి వచ్చి ఉండటం సరైన పద్ధతి కాదని, పిల్లల జీవితాలు పాడైపోతాయని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పారు. అయినా ఆ మహిళ భర్త దగ్గరకు వెళ్లేందుకు ససేమీర అనడంతో.. పోలీసులకు, గ్రామ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోలేదు. పిల్లలతో కలిసి ఉండేలా బలవంతం చేస్తే ఏదైనా చేసుకుంటుందేమోననే సంశయంతో మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో చిన్నారులకు పిడుగురాళ్ల పోలీసులే ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఆ పిల్లలను చూసిన స్థానికులు, పోలీసులు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!