Palnadu: ఆన్లైన్ ప్రేమాయణం.. ప్రియుడికోసం బరితెగించిన మహిళ.. పిల్లల్ని నడిరోడ్డుపై వదిలేసి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu: భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలను రోడ్డున పడేశాయి.. బరితెగించిన తల్లి ప్రియుడి కోసం పిల్లలను వదిలేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా… చరవాణిలో పరిచయమైన వ్యక్తి కోసం.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను వదిలేసింది ఓ తల్లి. పిల్లల కోసమైనా.. తిరిగి వెళ్లాలని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ససేమీర అంటోంది. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తతో తరుచూ గొడవ పడుతూ ఉండేది. ఇదే సమయంలో తుమ్మలచెరువు గ్రామానికి చెందిన రాజేష్ ఆమెకు ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది. ఆ మహిళ భర్తను వదిలి ఐదు నెలల క్రితం తుమ్మలచెరువులోని రాజేష్ వద్దకు చేరుకుంది. మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామపెద్దల ద్వారా నచ్చజెప్పి పిల్లలతో కలిసి ఉండేలా విజయనగరం పంపించారు. వారం క్రితం మరోసారి ఈ మహిళ మళ్ళీ రాజేష్ వద్దకు చేరుకుంది.
READ MORE: Bihar Assembly Election 2025 Date: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ప్రియుడి కోసం తమనే వదిలేసినట్లు ఆ ముక్క పచ్చలారని చిన్నారులకు తెలియదు కదా..? కుటుంబ సభ్యులతో కలిసి “అమ్మా.. ఎక్కడున్నావ్..” అంటూ ఆ చిన్నారులు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారుల తల్లిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇద్దరు పిల్లలను వదిలి ఇక్కడికి వచ్చి ఉండటం సరైన పద్ధతి కాదని, పిల్లల జీవితాలు పాడైపోతాయని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పారు. అయినా ఆ మహిళ భర్త దగ్గరకు వెళ్లేందుకు ససేమీర అనడంతో.. పోలీసులకు, గ్రామ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోలేదు. పిల్లలతో కలిసి ఉండేలా బలవంతం చేస్తే ఏదైనా చేసుకుంటుందేమోననే సంశయంతో మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో చిన్నారులకు పిడుగురాళ్ల పోలీసులే ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఆ పిల్లలను చూసిన స్థానికులు, పోలీసులు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!