TCS : ‘మూన్ లైటింగ్’ పై ఐటీ కంపెనీలు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS : భారత దేశంలోని మరో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూన్ లైటింగ్ విషయంపై స్పందించింది. మూన్లైటింగ్ను నైతిక సమస్యగా అభివర్ణించింది. ఇది కంపెనీ ప్రధాన సూత్రాలు, సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, మూన్ లైటింగ్ చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ దానికి తెలియకుండా మరో సంస్థలో పని చేయడాన్ని ‘మూన్ లైటింగ్’ గా పిలుస్తారు. ఇలా మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని విప్రో ఉద్యోగాల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది.
Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు శుభవార్త.. గోల్డ్ రేట్ తగ్గింది.. త్వరపడండి
Also Read
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, కంపెనీ ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులో ఉద్యోగులు మరే ఇతర సంస్థలోనూ పనిచేయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల, చాలా మంది ఐటీ రంగ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తూ ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. అయితే, విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, చాలా కంపెనీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Also: Election Agenda: ఇంటికో బైక్, రోజుకో ఫుల్ బాటిల్, రూ.20కే లీ.పెట్రోల్.. నాకే ఓటెయ్యండి?
ఇన్ఫోసిస్, విప్రో వంటి టీసీఎస్ ఐటీ సంస్థలు కూడా ఈ పద్ధతిని వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ సంస్థ కాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్చరిక లేఖ పంపింది. టీసీఎస్ సెప్టెంబర్లో తన ఉద్యోగులందరినీ వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని ఆదేశించింది. కంపెనీ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇప్పటికే సంస్థలోని సీనియర్ ఉద్యోగులంతా కార్యాలయానికి వస్తున్నారని లక్కర్ తెలిపారు. ఈ ఆర్డర్ను పాటించకపోతే క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తామని, అలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం ముంచుకొస్తున్న మాంద్యం నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులు రిమోట్ వర్క్ చేస్తే ఖర్చు తగ్గుతుందనే వాదన సైతం వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!