TCS : ‘మూన్ లైటింగ్’ పై ఐటీ కంపెనీలు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS : భారత దేశంలోని మరో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూన్ లైటింగ్ విషయంపై స్పందించింది. మూన్లైటింగ్ను నైతిక సమస్యగా అభివర్ణించింది. ఇది కంపెనీ ప్రధాన సూత్రాలు, సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, మూన్ లైటింగ్ చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ దానికి తెలియకుండా మరో సంస్థలో పని చేయడాన్ని ‘మూన్ లైటింగ్’ గా పిలుస్తారు. ఇలా మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని విప్రో ఉద్యోగాల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది.
Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు శుభవార్త.. గోల్డ్ రేట్ తగ్గింది.. త్వరపడండి
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, కంపెనీ ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులో ఉద్యోగులు మరే ఇతర సంస్థలోనూ పనిచేయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల, చాలా మంది ఐటీ రంగ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తూ ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. అయితే, విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, చాలా కంపెనీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Also: Election Agenda: ఇంటికో బైక్, రోజుకో ఫుల్ బాటిల్, రూ.20కే లీ.పెట్రోల్.. నాకే ఓటెయ్యండి?
ఇన్ఫోసిస్, విప్రో వంటి టీసీఎస్ ఐటీ సంస్థలు కూడా ఈ పద్ధతిని వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ సంస్థ కాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్చరిక లేఖ పంపింది. టీసీఎస్ సెప్టెంబర్లో తన ఉద్యోగులందరినీ వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని ఆదేశించింది. కంపెనీ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇప్పటికే సంస్థలోని సీనియర్ ఉద్యోగులంతా కార్యాలయానికి వస్తున్నారని లక్కర్ తెలిపారు. ఈ ఆర్డర్ను పాటించకపోతే క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తామని, అలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం ముంచుకొస్తున్న మాంద్యం నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులు రిమోట్ వర్క్ చేస్తే ఖర్చు తగ్గుతుందనే వాదన సైతం వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!