Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Montha Cyclone Cm Chandrababu Directs Officials To Stay At Field Level And Monitor Relief Operations

Montha Cyclone: క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ బృందాలు ఉండాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..!

Published Date :October 28, 2025 , 10:00 pm
By Kothuru Ram Kumar
Montha Cyclone: క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ బృందాలు ఉండాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాత్రి సమయంలో కూడా ఎలాంటి అలసత్వం లేకుండా కాల్వలు, చెరువులు, రోడ్ల వంటి ప్రాధమిక వసతులను పర్యవేక్షించాలని సూచించారు.

కేవలం 5.99mm మందం, 50MP+50MP+50MP కెమెరాలు, పవర్‌ఫుల్ స్పెక్స్‌తో వచ్చేస్తున్న Motorola Edge 70..!

Also Read

  • Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
  • Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
Add as a preferred
source on google

తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులతో పాటు, పంట నష్టంపై ఖచ్చితమైన అంచనాలు వేయాలని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ సర్వేలు నిర్వహించడంతో పాటు, శాటిలైట్ డేటా, డ్రోన్ సర్వే వంటి టెక్నాలజీ సాధనాలను వినియోగించాలని సూచించారు. అన్ని శాఖలు తమ తమ విభాగాల నష్టాలపై నివేదికలు సిద్ధం చేసి, ప్రాథమిక అంచనాలను త్వరితగతిన కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కేంద్రం నుండి మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఫీల్డ్ అధికారులతో మాట్లాడారు. ఆయన ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల కలెక్టర్లతో తుఫాన్ తీవ్రత, వర్షపాతం, వరద ప్రవాహాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఏలేశ్వరం, బుడమేరు వంటి వాగుల ప్రవాహాలను సమీక్షించిన సీఎం, ఏలేశ్వరం రిజర్వాయరుకు రెండు రోజుల్లో 3 టీఎంసీల వరకూ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పిన నేపథ్యంలో.. వరద నియంత్రణ చర్యలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తదితరులు తమ తమ జిల్లాల పరిస్థితులను ముఖ్యమంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. ఫీల్డ్ స్థాయిలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

Samsung Galaxy S25 Ultra: సామ్ సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై రూ. 28 వేల డిస్కౌంట్.. ఇదిగో డీల్

ఇక సచివాలయంలో మంత్రి నారా లోకేష్ తుఫాన్ పరిస్థితిపై మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా, మంత్రి నారాయణ మున్సిపాలిటీల్లో నేలకొరిగిన చెట్లను వెంటనే తొలగించాలని డ్రైనేజ్, రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సమన్వయంతో తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrababu Naidu
  • cm chandrababu
  • Montha Cyclone
  • Montha Cyclone Relief
  • Montha cyclone update

తాజావార్తలు

  • Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత

  • Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..

  • KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్

  • Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..

  • SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions