Moinabad Episode: ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు… రిమాండ్ రిపోర్టులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అంశం మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ (Moinabad Episode). ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా తెలిపారు పోలీసులు. మొయినాబాద్ ఫాం హౌస్ లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. హాల్ లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు ఉంచామన్నారు పోలీసులు.
రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ హాళ్లో మ.3.05కి రహస్య కెమెరాలు ఆన్ చేశాం అని వివరించారు పోలీసులు. మ.3.10కి నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారని వెల్లడించారు. సా.4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు వచ్చారన్నారు పోలీసులు. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి తాము చెప్పాం అన్నారు పోలీసులు. పోలీసులు చెప్పినట్టుగానే జరిగింది. కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లారు పోలీసులు.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైందన్నారు పోలీసులు. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయిందన్నారు. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్ లో రికార్డయింది. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారన్నారు. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పొందుపరిచారు పోలీసులు.
Read Also: Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీ్న్ షాట్లు పొందుపరిచారు పోలీసులు. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటు “సంతోష్ బీజేపీ” పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పొందుపరిచారు పోలీసులు. నందు డైరీలో 50 మంది తెరాస, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు పోలీసులు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారన్నారు.
Read Also: Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
తాజావార్తలు
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!