Moinabad Episode: ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు… రిమాండ్ రిపోర్టులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అంశం మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ (Moinabad Episode). ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా తెలిపారు పోలీసులు. మొయినాబాద్ ఫాం హౌస్ లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. హాల్ లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు ఉంచామన్నారు పోలీసులు.
రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ హాళ్లో మ.3.05కి రహస్య కెమెరాలు ఆన్ చేశాం అని వివరించారు పోలీసులు. మ.3.10కి నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారని వెల్లడించారు. సా.4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు వచ్చారన్నారు పోలీసులు. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి తాము చెప్పాం అన్నారు పోలీసులు. పోలీసులు చెప్పినట్టుగానే జరిగింది. కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లారు పోలీసులు.
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైందన్నారు పోలీసులు. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయిందన్నారు. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్ లో రికార్డయింది. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారన్నారు. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పొందుపరిచారు పోలీసులు.
Read Also: Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీ్న్ షాట్లు పొందుపరిచారు పోలీసులు. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటు “సంతోష్ బీజేపీ” పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పొందుపరిచారు పోలీసులు. నందు డైరీలో 50 మంది తెరాస, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు పోలీసులు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారన్నారు.
Read Also: Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!