Mohsin Naqvi: “మేము భారత్తో ఆడటానికి కారణం ఆయనే”.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi: ఇటీవల జరిగిన భారత-పాకిస్థాన్ మ్యాచ్ ఏ మేరకు హాట్ టాపిక్గా మారిందో తెలిసిన విషయమే. పాకిస్థాన్ భారత్తో మ్యాచ్ ఆడేందుకు ముందు ఒప్పుకోలేదు. అనేక మీటింగ్స్ తరువాత ఎట్టకేలకు దిగి వచ్చి మ్యాచ్ ఆడింది. అంతే కాదు.. ఎంతో బిల్డప్ కొట్టిన పాకిస్థాన్ చివరకు భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఈ అంశంపై తాజాగా పీబీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ యూటర్న్ వెనుక అసలు కారణం అనుర కుమార దిసానాయకే (Anura Kumara Dissanayake ) అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 9న పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతినిధులు కలిసి దీర్ఘ చర్చలు జరిపారు. ఈ చర్చలతో పాటు శ్రీలంక అధ్యక్షుడు స్వయంగా జోక్యం చేసుకుని పాకిస్థాన్ ప్రధానికి ఫోన్ చేసి మ్యాచ్ ఆడేలా అనుమతించాలని కోరారు. ఆ ఫోన్ కాల్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నఖ్వీ తెలిపారు. ప్రధాని షరీఫ్ వెంటనే తనను సంప్రదించి “ఇక ఎలాంటి సమస్య లేదు, మ్యాచ్ ఆడాలి” అని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు.
READ MORE: Harish Rao: దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..
Also Read
- Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
- Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్తోనే
- India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
- Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
మ్యాచ్ అనంతరం నఖ్వీ, శ్రీలంక అధ్యక్షుడిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “నిన్నటి మ్యాచ్లో నిజమైన హీరో మీరు. రెండు బిలియన్ మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ను ఆస్వాదించారు. అది మీ వల్లే సాధ్యమైంది” అని అన్నారు. అంతా సవ్యంగా జరిగి మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ, పాకిస్థాన్కు ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం (R. Premadasa Stadium)లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ బలమైన ప్రదర్శన చేసింది. ఇషాన్ కిషన్ అద్భుతంగా 77 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. కఠినమైన పిచ్పై భారత్ మొత్తం 175 పరుగులు చేసింది. తర్వాత బౌలింగ్లోనూ భారత జట్టు అదరగొట్టింది. పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా ఔటవుతూ మ్యాచ్ను చేతులారా కోల్పోయారు. ఈ ఓటమి కారణంగా పాకిస్థాన్కు తర్వాతి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
READ MORE: Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!
తాజావార్తలు
-
Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు.. వినేష్ ఫోగాట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
-
Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్తోనే
-
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!