Mohammad Nabi Retirement: రిటైర్మెంట్పై మహ్మద్ నబీ కీలక నిర్ణయం!
- మహ్మద్ నబీ కీలక నిర్ణయం
- వన్డేలకు రిటైర్మెంట్
- 165 వన్డేల్లో 3549 పరుగులు
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ క్రిక్బజ్కి ధృవీకరించారు. నబీ టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు.
‘మహ్మద్ నబీ వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలకాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి నిజమే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు రిటైర్ అవుతాడు. ఇప్పటికే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు దృష్టికి ఈ విషయాన్ని నబీ తీసుకొచ్చాడు. ఇదే విషయంను కొన్ని నెలల కిందటే నాకు చెప్పాడు. నబీ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. టీ20ల్లో మాత్రం నబీ కొనసాగుతాడని ఆశిస్తున్నాం’ అని నసీబ్ ఖాన్ క్రిక్బజ్తో అన్నాడు.
Also Read: Surya Kumar Yadav: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ‘సూరీడు’ని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!
2009లో అఫ్గానిస్థాన్ తరఫున క్రికెట్ అరంగేట్రం చేసిన మహ్మద్ నబీ.. 165 వన్డేల్లో 3549 పరుగులు, 171 వికెట్లు పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్, పాకిస్తాన్లపై అఫ్గాన్ చారిత్రత్మక విజయాలు సాధించడంలో నబీది కీలక పాత్ర. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక పొట్టి ఫార్మాట్లో టీ20 ప్రపంచకప్ 2026 వరకు కొనసాగే అవకాశముంది.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!