Modi Tour: ఈజిప్టులో ప్రధాని మోదీ పర్యటన.. మోదీ.. మోదీ అంటూ నినాదాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఈజిప్ట్కు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఈజిప్ట్ ప్రధాని వచ్చారు. అక్కడ ఇద్దరు నేతలూ ఆప్యాయంగా కలుసుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సంప్రదాయ బ్యాండ్ వాయిస్తూ స్వాగతం పలికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.
Read Also: క్రెడిట్ కార్డ్ ఉపయోగించే జనాభా అధికంగా ఉన్న దేశాలు(శాతాల్లో)
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఈజిప్టు అధ్యక్షుడు అల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల ఈజిప్టు పర్యటనకు వచ్చారు. 26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. కైరోలో దిగిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఈ పర్యటన ఈజిప్టుతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు జరపడానికి మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. అంతేకాకుండా. “విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని ముస్తఫా మద్బౌలీకి ధన్యవాదాలు. భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి అని మోదీ ట్వీట్ చేశారు.
Read Also: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఈ టిప్స్ మీ కోసమే..
ప్రధాని మోదీ కైరోలోని ఓ హోటల్కు చేరుకోగానే భారతీయ ప్రజలు భారత త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ‘మోదీ, మోదీ’, ‘వందేమాతరం’ నినాదాలతో స్వాగతం పలికారు. చీర కట్టుకున్న ఈజిప్టు మహిళ ‘షోలే’ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘యే దోస్తీ హమ్ నహీ చోడేంగే’ పాడి ప్రధాని మోదీకి స్వాగతం పలికింది. ఈ సమయంలో ప్రధాని పాటను వింటూ కనిపించారు. తనకు హిందీ మాట్లాడం చాలా తక్కువ అని.. భారతదేశానికి ఎప్పుడూ రాలేదని ఆ మహిళ చెప్పడంతో మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నువ్వు ఈజిప్ట్ కూతురా.. లేక భారత్ కూతురా.. అనే విషయం కూడా ఎవరికీ తెలియదన్నారు.
Read Also: Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరికలు!
మరోవైపు ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసితో మోదీ భేటీ కానున్నారు. ఈజిప్టు క్యాబినెట్లోని భారత యూనిట్తో తన కౌంటర్పార్ట్మెంట్ మడ్బౌలీ నేతృత్వంలో జరిగే రౌండ్ టేబుల్ చర్చకు ప్రధాని హాజరవుతారు. దీని తరువాత, PM మోడీ ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ, డాక్టర్ షాకి ఇబ్రహీం అబ్దేల్-కరీం అల్లమ్ను కలుసుకుంటారు. ఆ తరువాత ఈజిప్టులోని ప్రముఖ మేధావులతో చర్చలు జరుపుతారు. అంతేకాకుండా ఆదివారం దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును ప్రధాని మోదీ సందర్శించనున్నారు. భారతదేశంలోని బోహ్రా కమ్యూనిటీ యొక్క మూలాలు నిజానికి ఫాతిమా రాజవంశానికి చెందినవి. వారు 1970ల నుండి మసీదును పునరుద్ధరించారు.
- Tags
- Egypt
- international
- modi
- tour
- welcome
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..