Modi Tour: ఈజిప్టులో ప్రధాని మోదీ పర్యటన.. మోదీ.. మోదీ అంటూ నినాదాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఈజిప్ట్కు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఈజిప్ట్ ప్రధాని వచ్చారు. అక్కడ ఇద్దరు నేతలూ ఆప్యాయంగా కలుసుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సంప్రదాయ బ్యాండ్ వాయిస్తూ స్వాగతం పలికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.
Read Also: క్రెడిట్ కార్డ్ ఉపయోగించే జనాభా అధికంగా ఉన్న దేశాలు(శాతాల్లో)
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ఈజిప్టు అధ్యక్షుడు అల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల ఈజిప్టు పర్యటనకు వచ్చారు. 26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. కైరోలో దిగిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఈ పర్యటన ఈజిప్టుతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు జరపడానికి మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. అంతేకాకుండా. “విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని ముస్తఫా మద్బౌలీకి ధన్యవాదాలు. భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి అని మోదీ ట్వీట్ చేశారు.
Read Also: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఈ టిప్స్ మీ కోసమే..
ప్రధాని మోదీ కైరోలోని ఓ హోటల్కు చేరుకోగానే భారతీయ ప్రజలు భారత త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ‘మోదీ, మోదీ’, ‘వందేమాతరం’ నినాదాలతో స్వాగతం పలికారు. చీర కట్టుకున్న ఈజిప్టు మహిళ ‘షోలే’ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘యే దోస్తీ హమ్ నహీ చోడేంగే’ పాడి ప్రధాని మోదీకి స్వాగతం పలికింది. ఈ సమయంలో ప్రధాని పాటను వింటూ కనిపించారు. తనకు హిందీ మాట్లాడం చాలా తక్కువ అని.. భారతదేశానికి ఎప్పుడూ రాలేదని ఆ మహిళ చెప్పడంతో మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నువ్వు ఈజిప్ట్ కూతురా.. లేక భారత్ కూతురా.. అనే విషయం కూడా ఎవరికీ తెలియదన్నారు.
Read Also: Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరికలు!
మరోవైపు ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసితో మోదీ భేటీ కానున్నారు. ఈజిప్టు క్యాబినెట్లోని భారత యూనిట్తో తన కౌంటర్పార్ట్మెంట్ మడ్బౌలీ నేతృత్వంలో జరిగే రౌండ్ టేబుల్ చర్చకు ప్రధాని హాజరవుతారు. దీని తరువాత, PM మోడీ ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ, డాక్టర్ షాకి ఇబ్రహీం అబ్దేల్-కరీం అల్లమ్ను కలుసుకుంటారు. ఆ తరువాత ఈజిప్టులోని ప్రముఖ మేధావులతో చర్చలు జరుపుతారు. అంతేకాకుండా ఆదివారం దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును ప్రధాని మోదీ సందర్శించనున్నారు. భారతదేశంలోని బోహ్రా కమ్యూనిటీ యొక్క మూలాలు నిజానికి ఫాతిమా రాజవంశానికి చెందినవి. వారు 1970ల నుండి మసీదును పునరుద్ధరించారు.
- Tags
- Egypt
- international
- modi
- tour
- welcome
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!