PM Modi: కాశ్మీర్ భారీ మార్పులు.. రాత్రిపూట ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారు..
- జెడ్-మోర్ టన్నెల్ను ప్రారంభించిన మోడీ
- బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని
- కశ్మీర్లో ఇప్పటి వరకు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్న పీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు. రాత్రిపూట కూడా ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారన్నారు. గతంలో రాత్రిపూట కూడా అక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. శాంతి నెలకొన్న సందర్భంగా గత 10 సంవత్సరాలలో పర్యాటక రంగా పురోగతి సాధించిందని తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్కు 2 కోట్లకు పైగా పర్యాటకులు వచ్చారని వెల్లడించారు. ఇక్కడ సోనామార్గ్లో కూడా పర్యాటకులు 10 సంవత్సరాలలో 6 రెట్లు పెరిగినట్లు చెప్పారు. స్థానికులు ప్రయోజనం పొందుతున్నారన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగాలు..
జమ్మూకాశ్మీర్ ఇప్పుడు సొరంగాలు, ఎత్తైన వంతెనలు, రోప్వేలకు కేంద్రంగా మారుతోందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగాలు ఇక్కడ నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో గత 10 ఏళ్లలో చాలా విద్యాసంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఇక్కడి మన యువత ఎంతో ప్రయోజనం పొందారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ ప్రయాణంలో మన పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. మెరుగైన కనెక్టివిటీ కారణంగా, పర్యాటకులు జమ్మూ కాశ్మీర్లోని చివరి ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకుంటారని మోడీ తెలిపారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఈరోజు చాలా ప్రత్యేకమైనది..
ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని నరేంద్ర మోడీ అన్నారు. నేడు దేశంలోని నలుమూలలా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రయాగ్రాజ్లో ఈరోజు నుంచే మహా కుంభోత్సవం ప్రారంభమవుతోందని ప్రధాని గుర్తు చేశారు. పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది అక్కడికి తరలివస్తున్నారన్నారు. నేడు, పంజాబ్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం లోహ్రీ పట్ల ఉత్సాహంతో నిండి ఉందని చెప్పారు. ఉత్తరాయణం, మకర సంక్రాంతి, పొంగల్ వంటి అనేక పండుగల కాలం ఇదని వెల్లడించారు. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఈ పండుగలు జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!