MLC Sheikh Sabji: నేను నిరపరాదిని…….హైకోర్టుకెళతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ దర్శన టికెట్ల కుంభకోణంలో టీచర్స్ ఎమ్మెల్సీ షాక్ సాబ్జీ టీటీడీ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంచలనం రేకెత్తిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున షేక్ సాబ్జీ రెండేళ్ల క్రితం గెలుపొందారు.బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్న విషయాన్ని గ్రహించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆయనపై కేసు నమోదుకు రెడీ అయ్యారు. ఈ నెలలో 19 సిఫార్సు లేఖలను ఎమ్మెల్సీ పంపగా, టీటీడీ పరిగణనలోకి తీసుకుని బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించింది. ఇవాళ ఏకంగా 14 మంది భక్తులను వెంటబెట్టుకుని ఆయన తిరుమల దర్శనానికి వెళ్లారు. అలాగే ఇదే నెలలో ఆయన మూడు సార్లు తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
Read Also:Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ ఇచ్చిన సిఫారసు లేఖలపై నిఘా పెట్టారు అధికారులు. ఈ సందర్భంగా పలు విభ్రాంతికరమయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ దర్శనానికి వచ్చిన 14 మంది భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించారు. తామంతా కర్నాటక వాసులుగా చెప్పారు. హైదరాబాద్కు చెందిన వారిగా ఆధార్లో ట్యాంపరింగ్కు పాల్పడినట్టు గుర్తించారు. దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు రూ.1.05 లక్షలను భక్తులు బదిలీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముతున్నారని విజిలెన్స్ తేల్చింది. ఇది తీవ్రమైన నేరంగా భావించిన టీటీడీ కేసు నమోదుకు రెడీ అయింది. అక్రమాలకు పాల్పడే వ్యక్తలు ఎవరైనా వారిపై కఠినచర్యలు తప్పవన్నారు ఈవో ధర్మారెడ్డి. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు నమోదే ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాను నిరపరాదినన్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మేరకు దేశంలో ఏ ప్రాంతంలో వున్న వారినైనా నేను దర్శనానికి తీసుకువెళ్ళే హక్కు నాకు వుంది. ఆథార్ కార్డులు ఫోర్జరి చెయ్యవలసిన అవసరం నాకు లేదు. కుట్రపూరితంగా నా పై కేసు నమోదు చేసారు. ఈ వ్యవహారం పై హైకోర్టును ఆశ్రయిస్తాను అన్నారు. విజిలెన్స్ వారు చెప్పేదానికి ….వాస్తవాలకు సంబంధం లేదన్నారు. ఆథార్ కార్డు ఫోర్జరి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని నేనే పోలీసులును కోరినా. అయితే, వారు కేసు నమోదు చేయడం లేదు. నాతో దర్శనానికి వచ్చిన రవింద్ర అనే భక్తుడు వద్ద సంతకాలు తీసుకోని నాపై తప్పుడు కేసు నమోదు చేసారు. 32 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నేను ఏనాడూ తప్పు చెయ్యలేదు. నా పేరుతో చిల్లిగవ్వ కూడా లేదన్నా షేక్ షాబ్జీ.
Read Also:Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రేయస్ సర్జరీ సక్సెస్
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!