Supreme Court : ఈ కేసులో కవిత నిందితురాలు కాదు.. ఈడీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మొదటిసారి కవితను ఇంటివద్దనే ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆ తరువాత ఢిల్లీలోకి కేంద్ర కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల 11న ఢిల్లీ ఈడీ ముందు హాజరైన కవితను ఈడీ అధికారలు సుమారు 9 గంటల పాటు విచారించారు. ఆతరువాత ఈనెల 16న మరోసారి ఈడీ కార్యాలయానికి రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంతో.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ నిబంధనలు ఉల్లంఘించిందని సర్వోన్నత న్యాయస్థానంలో కవిత పిటిషన్ వేశారు. దీంతో ఈనెల 24న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కవిత పిటషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవిత తరుఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత నిందితురాలు కాదని, సమన్ల విషయంలో ఈడీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు.
Also Read : T.Congress : రచ్చకెక్కిన హనుమకొండ కాంగ్రెస్ వర్గ పోరు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
చార్జి షీట్ ఇప్పటికే దాఖలు చేశారని, నళిని చిదంబరం కేసులతో ఓ సారి పరిశీలించాలన్నారు. దీనిపై.. పీఎంఎల్ఏ కేసులలో మదన్ లాల్ జడ్జిమెంట్ వర్తించదని ఈడీ వాదనలు వినిపించింది. ఇరువైపు వాదనలు విన్న సుప్రీం కోర్టు.. నళిని చిదంబరం కేసుతో కవిత కేసు ట్యాగ్ చేసింది. దీంతో.. అడిషనల్ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. దీనిపై విచారణ చేసిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్పందిస్తూ.. ఈ కేసులో చాలా కోర్ అంశాలున్నాయని, అన్నింటినీ లోతుగా విచారణ చేయాలని వెల్లడించింది. ఈ కేసులో తమకు ఒక నోటు ఇవ్వాలని కపిల్ సిబిల్ కు సూచించింది సుప్రీంకోర్టు. అయితే.. వాదనలు విన్న సుప్రీం కోర్టులో కవిత పిటిషన్పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
Also Read : Charan NTR: ఈ ట్వీట్ కోసం కదా ఇంతసేపు వెయిట్ చేసింది…
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!