MLC Kavitha : తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ హస్తంలోనే
- ఎం.ఎల్.సి. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు – రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
- తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్ – కేసీఆర్ పాత్రపై కవిత స్పష్టత
- రంజాన్ తోఫా నిలిపివేతపై అసంతృప్తి – కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ఆమె ప్రశ్నించారు. తమ పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించామని, ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం దారుణమని కవిత పేర్కొన్నారు. “నిద్రలో కూడా ఆయన కేసీఆర్ను కలవరపెడుతున్నారని” వ్యాఖ్యానించారు. ఓ దశలో రైతుబంధును రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం తగదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంటే కేసీఆర్, ఆ భవిష్యత్తు కూడా ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి గంగా-జమునా తహజీబ్కు ప్రతీక అని అన్నారు. మతసౌహార్ధాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజకీయ సాధనంగా మాత్రమే చూస్తోందని ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా పూర్తిగా అమలు చేయలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై త్వరలోనే తమ తీర్పును వెలిబుచ్చుతారని, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Ram Charan : ఆటకూలీగా రామ్ చరణ్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరింది
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?