Satya Kumar Yadav: రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోంది!
- పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సత్య కుమార్
- ఓటు హక్కును వినియోగించుకోవాలి
- ఆలపాటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడిని గెలిపించాలని మంత్రి కోరారు.
మంత్రి సత్య కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విజయవాడ గాంధీజీ కాలేజీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి జాగారం చేసిన సందర్భంగా ఓటర్లు తక్కువగా వస్తున్నారు. ఈ ఓటర్లు అందరూ కూడా చదువుకున్న వారు, విద్యావంతులు. ఓటు హక్కు ప్రాధాన్య గురించి వారికి నేను చెప్పనవసరం లేదు. అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓటర్లు అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. మూడుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఆలపాటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు’ అని అన్నారు.
Also Read
‘కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో ఎలాంటి పాలన అందిందో ప్రజలందరూ చూశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంది. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉంది. ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తున్నాయో ప్రజలందరూ ఆలోచించాలి. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారు. అలాంటి కూటమి అభ్యర్థిగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలి. ఇప్పటి వరకు 25 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇది ఇంకా పెరగాలి’ అని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!