MLA Sri Ganesh: మా పార్టీకి చెందిన నేతే టార్గెట్ చేశారు.. వివరాలు రెండు రోజుల్లో చెప్తా!
- సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్పై దాడికి యత్నం
- దాడి యత్నంపై స్పందించిన ఎమ్మెల్యే
- మా పార్టీకి చెందిన ఓ నేత నన్ను టార్గెట్ చేశారు
- పోలీసులకు అన్ని వివరాలు రెండు రోజులో చెప్తా
Secunderabad MLA Sri Ganesh Statement Over Attack: ఆదివారం రాత్రి తనపై జరిగిన దాడి యత్నంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ స్పందించారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి ప్రయత్నం జరిగిందని, తనకు కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ నేత టార్గెట్ చేశారని స్పష్టం చేశారు. సదరు నేత రౌడీయిజం చేస్తాడని, గతంలో అతనిపై హత్య కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే అని, అందులో కొందరిని తాను గుర్తు పడుతా అని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ చెప్పారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగానే నిన్న రాత్రి దాడి ప్రయత్నం జరిగింది. నాకు కొందరిపై అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓ నేత నన్ను టార్గెట్ చేశారు. అతను రౌడీయిజం చేస్తాడు, గతంలో అతనిపై హత్య కేసులు ఉన్నాయి. గత శుక్రవారం నార్త్ జోన్ డీసీపీని కలసి ఫిర్యాదు చేశా. నా సన్నిహితులను బయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే. అందులో నేను కొందరిని గుర్తుపడుతా. మళ్లీ పోలీసులను కలిసి అన్ని వివరాలు రెండు రోజులో చెప్తా. పోలీసులు కేసు పారదర్శకంగా దర్యాప్తు చేయకపోతే నేనే వారి పేర్లు బయటపెడతా’ అని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ తెలిపారు.
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
Also Read: Jaganmohan Rao: దొడ్డిదారిన గెలిచిన జగన్మోహన్ రావు.. సీఐడీ విచారణలో వెలుగులోకి సంచలనాలు!
‘మా గన్మెన్ల గన్స్ లాక్కున్నారా లేదా అని నేను చూడలేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. సీసీ కెమెరాల ద్వారా కేసు దర్యాప్టు చేస్తున్నారు. నేను రోడ్డుపై కారులో వెళ్తున్నాను. మా కార్ సైరన్ కొట్టిన మాట వాస్తవమే. సైరన్ కొడితే డ్రైవర్ దగ్గరికి రావాలి, డ్రైవర్ పైన అటాక్ జరగాలి. కానీ నన్ను ఎందుకు టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. మా ప్రభుత్వం ఇలాంటి రౌడీయిజాన్ని చూస్తూ ఊరుకోదు’ అని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ హెచ్చరించారు. మాణికేశ్వర్ నగర్లో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేపై ఆదివారం రాత్రి దుండగులు దాడికి యత్నించారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!