MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- ప్రధాని మోడీ పొదుపు పిలుపును ప్రజలు అర్థం చేసుకోవాలి
- పొదుపు వైపు ప్రజలు దృష్టి పెట్టాలి
- రాజకీయ విమర్శల కంటే దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం అందరి బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు పిలుపును ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రిలో రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బంగారం దిగుమతులపై భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించి పొదుపు వైపు ప్రజలు దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు.
1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధాని మోడీపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దేశ విదేశీ మారక నిల్వలు బలంగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. అలాగే ప్రధాని మోడీ తన భద్రతా కాన్వాయ్ను కూడా తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాన్వాయ్ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విమర్శల కంటే దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!