MLA Rajasingh : హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులపై దౌర్జన్యం చేస్తుందన్నారు. గత కొన్నేళ్ళుగా హుస్సేన్ సాగర్ లో డ్రైనేజ్ మురికి నీరు కలుస్తుంది దానివల్ల హుస్సేన్ సాగర్ పొల్ల్యూట్ కావడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్లో వైభవంగా జరుగుతూ వస్తున్నాయని, మహారాష్ట్ర తర్వాత గణేష్ ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయన్నారు. కొంతమంది కావాలని గణేష్ నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుందని కోర్టులో పిటిషన్ వేశారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది సరైన రీతిలో వాదించలేకపోవడం వల్లే హైకోర్టు పిఓపి వినాయకులను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని తీర్పు చెప్పింది.. హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత కలవడం లేదా ఫ్యాక్టరీల వ్యర్ధాలంతా హుస్సేన్ సాగర్ లోకి రావడం లేదా కేసీఆర్ సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా హుస్సేన్ సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎందుకు మార్చలేకపోయారు..? రాష్ట్రంలో పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తుంది వినాయకుడిని నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూషన్ అవుతుంది అనే రిపోర్టు మీ దగ్గర ఉంటే జడ్జి ముందర ఎందుకు పెట్టలేదు.. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇలాంటి తీర్పుని ఇవ్వడం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పిఓపి గణేష్ ల వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ కాదని జీవో ఇచ్చింది.. ఆ జీవోను హైకోర్టు జడ్జి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు. ఎప్పటిలాగే గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరుగుతుంది… ఎవరైనా అడ్డుపడితే ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత..’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!