Peddireddy Ramachandra Reddy: జగన్ మళ్లీ సీఎం అయితేనే ఆ నిజానిజాలు బయటకు వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: రాష్ట్ర ప్రజలకు ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతుందని.. ఈ రెండేళ్లలో ఒక అభివృద్ధి పథకం గాని సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అప్పుల కోసం వెంపర్లాడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని.. దోచుకున్న డబ్బులు విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. నేడు లండన్ పర్యటన అని చెప్పి సింగపూర్లో వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నారని వదంతులు వస్తున్నాయన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
READ MORE: Arjun Tendulkar: 8 ఓవర్లలో 78 పరుగులు.. అర్జున్ టెండూల్కర్కు ఐపీఎల్ కూడా కష్టమేనా?
Also Read
- Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
- KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
హామీల అమల్లో చంద్రబాబు, వైయస్ జగన్కు తేడా ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచించారు. “కరోనా సమయంలో కూడా ఇచ్చిన మాట మీద నిలబడిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్.. రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే రెండు లక్షల కోట్లు అప్పు చేశారు.. తెచ్చిన అప్పులు ఏ పథకాలకు వినియోగిస్తున్నారు, ఏ ప్రాజెక్టులు కడుతున్నారు? వైఎస్ జగన్ ప్రభుత్వంలో వీటన్నిటినీ వెలికితీసే పరిస్థితి వస్తుంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. ఈ ఏడాది నుంచి పార్టీ శ్రేణులు మరింత శ్రమించి పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నా.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Anam Ramanarayana Reddy: ఆలయాలు కాపాడటానికి రామలక్ష్మణుల్లా సీఎం, డిప్యూటీ సీఎం
తాజావార్తలు
-
Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
-
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
-
China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
-
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
-
Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!