Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో కేవలం ఒకే ఒక్క పానీపూరీ కోసం జరిగిన వివాదం.. రెండు దశాబ్దాల క్రితం మొదలై ఏకంగా 12 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్తులు, ఆర్థిక గొడవలతో కోర్టులు నిండిపోతున్న ప్రస్తుత కాలంలో, ఐదు రూపాయల పానీపూరీ వివాదం న్యాయస్థానం వరకు వెళ్లడం వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది.
ఏం జరిగిందంటే..
హరియాణాలోని ఒక ప్రాంతంలో 2014లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఒక సాయంత్రం వేళ స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పానీపూరీ తినడానికి బజారుకు వెళ్లారు. అక్కడ ఒక బండి వ్యాపారి ఐదు రూపాయలకు కేవలం నాలుగు పానీపూరీలు మాత్రమే ఇచ్చాడు. చుట్టుపక్కల అందరూ ఐదు రూపాయలకు ఐదు పానీపూరీలు ఇస్తుంటే, నువ్వు నాలుగే ఎందుకు ఇస్తున్నావని సదరు కస్టమర్ ప్రశ్నించాడు. దీనికి అతడు దురుసుగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
Also Read
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు…
చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం కాస్తా పరస్పర దాడులు, ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అలా ఈ ‘పానీపూరీ కేసు’ న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణకు దారితీసింది.
12 ఏళ్ల విచారణ.. 15 మంది సాక్షులు..
ఈ చిన్న గొడవను తేల్చడానికి కోర్టుకు ఏకంగా 12 ఏళ్ల సమయం పట్టింది. ఈ కాలంలో ఇరు పక్షాల తరఫున దాదాపు 15 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. అనేక వాయిదాలు, వాదనల తర్వాత.. ఈ గొడవకు సంబంధించి ఇరు వర్గాల వద్ద సరైన, బలమైన ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది. చివరకు ఈ మధ్యే న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
సమయస్ఫూర్తి, సహనం లేకపోతే చిన్న విషయాలు కూడా ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ పానీపూరీ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. చిన్నపాటి పట్టు విడుపులతో పరిష్కారం కావలసిన ఈ వివాదం, పట్టుదలల కారణంగా 12 ఏళ్ల విలువైన సమయాన్ని, కోర్టు సమయాన్ని వృధా చేసింది. ఇది తెలుసుకున్న నెటిజన్లు కూడా ఏందిరా ఇది.. ఒక్క పానీ పూరీ కోసం 12 ఏళ్లుగా ఎదురు చూశాడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!