IPL Auction 2025: మిచెల్ స్టార్క్ రికార్డు బద్దలు కొట్టేది.. ఈ భారతీయ ఆటగాడే..!
- ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ప్రముఖ క్రికెటర్లు
- కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్
- అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి దిగ్గజాలు
- మిచెల్ స్టార్క్ వేలం రికార్డు ప్రమాదంలో ఉంది
- బ్రేక్ చేసేందుకు రిషబ్ పంత్ సిద్ధమయ్యాడు- ఇర్ఫాన్ పఠాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ను కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 2024 వేలంలో రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే.. స్టార్క్ తోటి ఆటగాడు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. అధిక ధరకు కొనుగోలు చేసిన కేకేఆర్కు స్టార్క్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో అతను మెగా వేలంలో ఉండనున్నాడు. అయితే.. ఈసారి స్టార్క్ రికార్డు వేలం కొల్లగొట్టకపోవచ్చునని.. ఇంతకుముందు మెగా వేలంలో స్టార్క్ రికార్డును బద్దలు కొట్టగల ఓ భారతీయ ఆటగాడు ఉన్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
Read Also: Assembly polls: మహారాష్ట్ర, జార్ఖండ్లో ముసిగిన ప్రచార హోరు.. ఎల్లుండి పోలింగ్
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి దిగ్గజాలు బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలో.. ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘మిచెల్ స్టార్క్ వేలం రికార్డు ప్రమాదంలో ఉంది. దాన్ని బ్రేక్ చేసేందుకు రిషబ్ పంత్ సిద్ధమయ్యాడు.’ అని తెలిపాడు.
Mitchell Starc’s auction record is in danger. @RishabhPant17 is ready to break it!
— Irfan Pathan (@IrfanPathan) November 18, 2024
Read Also: Thandel Bujji Thalli: నవంబర్ 21న వచ్చేస్తోన్న తండేల్ ‘బుజ్జి తల్లి’
రిషబ్ పంత్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా ఆడాడు. ఈసారి పంత్ను రిటైన్ చేయకపోవడంతో వేలంలోకి అడుగుపెట్టబోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ కూడా తమ కెప్టెన్లను విడిచిపెట్టింది. KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వేలంలో ఉండనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో మెగా వేలం జరగనుంది. మెగా వేలం కోసం మొత్తం 574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రూ.2 కోట్ల ప్రాథమిక ధరలో మొత్తం 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరి ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన ఈ అంచనా కరెక్ట్ అవుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!