Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు..ఫ్లైట్ లో పేలిన మొబైల్ ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో విమానాల్లో జరుగుతున్న పలు అంశాలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎయిరిండియా విమానం రాజస్థాన్లోని ఉదయపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి రావడంతో ఇవాళ (సోమవారం) భారీ విమాన ప్రమాదం తప్పింది. అయితే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 470లో ఒక ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలింది. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ వెళ్ళవలసి వచ్చింది. అన్ని సాంకేతిక తనిఖీల తర్వాత విమానం మళ్లీ ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే విమానంలోని మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేగింది.
Read Also: Bhatti Vikramarka : కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు తలదించుకునేలాగుంది
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ఈ విమానం మధ్యాహ్నం 1 గంటలకు ఉదయ్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఉదయ్పూర్లోని దబోక్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కొంతమంది ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించారు. ఆ తర్వాత విమానాన్ని సరిగ్గా తనిఖీ చేసి, అన్నీ క్లియర్ చేసిన తర్వాతే విమానాన్ని తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు.
Read Also: Liquor Sales: తగ్గిన మద్యం అమ్మకాలు.. పెరిగిన ఆదాయం..
అయితే, గత సంవత్సరం ఏప్రిల్ 14న ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వెళుతుండగా మధ్యలో ఫోన్లో మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో కూడా ఎలాంటి గాయాలు కాలేదు.. బ్యాటరీతో ఒక్కసారిగా వేడెక్కడంతో ఫోన్ లో మంటలు వచ్చాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. క్యాబిన్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..