Miss World 2025 : నేడు నాగార్జునసాగర్కు మిస్ వరల్డ్ పోటీదారులు
- నేడు నాగార్జునసాగర్కు మిస్ వరల్డ్ పోటీదారులు
- బుద్ధవనం ప్రాజెక్ట్ను సందర్శించనున్న సుందరీమణులు
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss World 2025 : మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననుండగా, వీరిలో ఎక్కువమంది ఆసియా దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. బౌద్ధమతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో, ఈ సుందరీమణులు బౌద్ధ థీమ్ పార్క్లోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధుని విగ్రహాల సమీపంలో ఆయా దేశాల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రార్థనలు జరగనున్నాయి.
NANI : బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలో ఆగిన హిట్ – 3
Also Read
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
హైదరాబాద్ నుంచి పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సుల ద్వారా, భారీ బందోబస్తు మధ్య పోటీదారులను బుద్ధవనానికి తీసుకెళ్లనున్నారు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథిగృహం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం విజయవిహార్లో ఫోటో సెషన్ అనంతరం బుద్ధవనంలోకి చేరుకుంటారు. లంబాడా కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అతిథులను స్వాగతించనున్నారు. బుద్ధవనంలోని మహాస్థూపం, బుద్ధ పాదాలు, జతాక వనం, ఓపెన్ థియేటర్ ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి. లేజర్ లైటింగ్, కళాత్మక డెకరేషన్ తో పర్యాటక వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
బుద్ధవనంలో ధ్యానం అనంతరం, బైలికుప్ప నుండి వచ్చిన 25 మంది బౌద్ధ సన్యాసులు మహాబోధి పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పురావస్తు నిపుణుడు డా. శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు ప్రాశస్త్యాన్ని, నాగార్జునసాగర్ ప్రాంతంలోని బౌద్ధ వారసత్వాన్ని వివరించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ 274 ఎకరాల బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధుని జీవితం, బోధనలు, బౌద్ధ కళా సంపదను ప్రతిబింబించే విధంగా నిర్మించబడింది. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో 2వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. అదేవిధంగా కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకలతో ప్రత్యేక వైద్య వార్డును వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.
Diamond League: నీరజ్ చోప్రా నేతృత్వంలో రంగంలోకి నలుగురు అథ్లెట్లు..!
తాజావార్తలు
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!