Miss World 2025 : మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననుండగా, వీరిలో ఎక్కువమంది ఆసియా దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. బౌద్ధమతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో, ఈ సుందరీమణులు బౌద్ధ థీమ్ పార్క్లోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ధ్యాన…
బుద్ధ జయంత్యుత్సవాలకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం ముస్తాబైంది. 2,566 వ బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనం, ధ్యానవనం, జాతక వనం, మహాస్థూపం, ఎంట్రన్స్ ప్లాజాలో 2,566 రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. బుద్ధవనం ప్రారంభం తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న బుద్ధ జయంతిని వీక్షకులకు మధురానుభూతులు పంచేలా నిర్వహిస్తున్నామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ ‘సమకాలీన సమాజానికి బౌద్ధ’ అనే…