Minister Vidadala Rajini: రాజధానిగా సమర్ధించని వాళ్లు ఏ ముఖం పెట్టుకుని విశాఖ వచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vidadala Rajini: విశాఖ రాజధానిగా సమర్ధించని వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుక్కోడానికి వచ్చారు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు మంత్రి విడదల రజిని.. కేజీహెచ్ ప్రధాన ద్వారం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చంద్రబాబు వైద్య పరంగా చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు తెస్తుంటే చూసి తట్టుకోలేక పోతున్నారని.. ప్రభుత్వం మీద కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ఏ ప్రభుత్వం లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో గమనిస్తున్నారని తెలిపారు. ఇక, ప్రభుత్వం మీద పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు దారుణం అన్నారు మంత్రి.. కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ చేసిన సేవలు వెల కట్టలేనివి.. అలాంటి వాలంటీర్ వ్యవస్థను పట్టుకొని దండుపాల్యం బ్యాచ్ అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Mrunal Thakur: చిట్టి గౌనులో మృణాల్ హాట్ ట్రీట్.. చూశారా?
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ఇక, రుషికొండ మీద పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు మంత్రి రజిని.. కోర్టు గైడ్లైన్స్ ప్రకారమే అక్కడ అంతా జరుగుతుందని స్పష్టం చేశారు. ఊరికే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే మంచిది అని హితవు పలికారు. మరోవైపు.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్థాపించి వందేళ్లు అవుతుంది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది పేషెంట్లు వస్తుంటారు.. ఉత్తరాంద్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ లో ఎందరో లక్షలాదిమంది మెరుగైన వైద్య సేవలు పొందారని తెలిపారు. అదునాతన టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తుంది.. త్వరలోనే మరికొన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి విడదల రజిని.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!