Vemula Prashanth Reddy : దేశంలో బీజేపీ పార్టీ తప్ప ఏ పార్టీ నాయకులు ఉండొద్దా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందటూ ఓ బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీకి ఆగడాలను ప్రశ్నిస్తున్నారనే.. సీఎం కేసీఆర్ తనయ కవితపై పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే.. ఇదిలా ఉంటే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
Also Read
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
దీంతో.. నాంపల్లి కోర్టు అప్పటికే విధించిన రిమాండ్ను రద్దు చేస్తూ.. రాజాసింగ్ను విడుదల చేసింది. అయితే.. తాజాగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. మోడీ మాటలు తప్ప దేశాభివృద్ధికి చేసిందేమి లేదంటూ విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ కేసులు. కేసీఆర్ దేశాభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ పార్టీ తప్ప ఏ పార్టీ నాయకులు ఉండొద్దా..? అని ఆయన ప్రశ్నించారు. మోడీ దోస్త్ అదానీ ఆదాయం పెరిగింది తప్ప.. పేదల ఆదాయం పెరగలేదని ఆయన అన్నారు. కేసీఆర్ను అడ్డుకునేందుకు కవితపై ప్లాన్ ప్రకారం ఆరోపణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులకు భయపడం.. కచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!