Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత
- పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ కార్యక్రమం
- మగ పిల్లలను బాధ్యతగా పెంచాలి
- పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో.. మగ పిల్లలను కూడా అలాగే పెంచాలన్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరని, పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత్తు పదార్ధాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని హోంమంత్రి తెలిపారు. ‘ఆడ బిడ్దలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు.
ఆడ పిల్లలను కాపాడాలనే నినాదంతో ‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ కార్యక్రమంను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… ‘ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో మగ పిల్లలను కూడా అలాగే పెంచాలి. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి. హోమ్ మినిస్టర్గా కొన్ని ఘటనలు చూస్తే భయం వేస్తుంది. పొత్తిళ్ళలో ఉండే చిన్న పిల్లలపై సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ మత్తులో కొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరు. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలి. సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆడ బిడ్డలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలవుతారు. రాష్ట్రంలో మత్తుపదార్ధాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ద్వారా మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాం’ అని అన్నారు.
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ పేరుతో 2కె రన్ నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా. సామాజిక బాధ్యత కింద దీన్ని చేపడుతున్నా. మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలు ఎవరిపై ఆధారపడకూడదనే సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలు తెచ్చారు. వారి రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి ఇంట్లో ఆడ పిల్లలను ప్రోత్సహించాలి. ఆడ పిల్లలకు అవకాశాలు ఇస్తే బాగా రాణిస్తారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..