Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత
- పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ కార్యక్రమం
- మగ పిల్లలను బాధ్యతగా పెంచాలి
- పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో.. మగ పిల్లలను కూడా అలాగే పెంచాలన్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరని, పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత్తు పదార్ధాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని హోంమంత్రి తెలిపారు. ‘ఆడ బిడ్దలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు.
ఆడ పిల్లలను కాపాడాలనే నినాదంతో ‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ కార్యక్రమంను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… ‘ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో మగ పిల్లలను కూడా అలాగే పెంచాలి. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి. హోమ్ మినిస్టర్గా కొన్ని ఘటనలు చూస్తే భయం వేస్తుంది. పొత్తిళ్ళలో ఉండే చిన్న పిల్లలపై సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ మత్తులో కొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరు. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలి. సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆడ బిడ్డలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలవుతారు. రాష్ట్రంలో మత్తుపదార్ధాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ద్వారా మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాం’ అని అన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ పేరుతో 2కె రన్ నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా. సామాజిక బాధ్యత కింద దీన్ని చేపడుతున్నా. మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలు ఎవరిపై ఆధారపడకూడదనే సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలు తెచ్చారు. వారి రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి ఇంట్లో ఆడ పిల్లలను ప్రోత్సహించాలి. ఆడ పిల్లలకు అవకాశాలు ఇస్తే బాగా రాణిస్తారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?