Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vakiti Srihari: మంత్రి శ్రీహరి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతాన్ని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పారు. పేదల ఆకలి తీర్చడం, బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యమని అన్నారు. ప్రతి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించామని చెప్పారు.
Read Also:ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఈ కార్యక్రమంలో దాదాపు 90 వినతులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో అధికంగా ధరణి బాధితుల సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వమంతా కృషి చేస్తోందని తెలిపారు. ఓ పేదవాడు నేరుగా మంత్రిని కలిసి సమస్య వినిపించడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్న సంగతి ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే, బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు తడబడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని శ్రీహరి పేర్కొన్నారు. 100 టీఎంసీల నీరు వృథాగా పోతుందన్న వార్తలు మీడియాలో వచ్చినట్లు తెలిపారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. వచ్చే వారం కృష్ణ నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read Also:Daren Sammy: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు..!
రాష్ట్ర బీజేపీ నేతలపై కూడా మంత్రి శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. బీసీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మరోసారి బయటపడిందన్నారు. గతంలో బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించిన తీరు ఈ విషయాన్ని స్పష్టంగా చూపుతుందని విమర్శించారు. కుల గణన సర్వే అనంతరం కూడా బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవితకు కీలక పదవి ఇవ్వాలన్న సూచన చేస్తూ, రైల్ రోకో కార్యక్రమం చేపట్టేముందు పార్టీలో బీసీలకు ప్రాధాన్యత కలిగిన పదవి ఏర్పాటు చేయాలని అన్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!