Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Tummala Nageswara Rao Revealed The Details About The Loan Waiver

Tummala Nageswara Rao : రుణమాఫీపై వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Published Date :October 3, 2024 , 11:10 pm
By Gogikar Sai Krishna
Tummala Nageswara Rao : రుణమాఫీపై వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికి బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళ పరిచి వాళ్ల రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు. వారికి అర్థమయ్యే విధంగా మరొక్కసారి వివరాలన్ని తెలియజేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు అని, వీరిలో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉండి, తెలంగాణలో ఉన్న బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అని ఆయన తెలిపారు. 2018 రుణమాఫీ పథకంలో గత ప్రభుత్వానికి అందిన ఖాతాలు 40 లక్షలు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.  2018 రుణమాఫీ పథకం కనీసం 20 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదు. అదికూడా ఆఖరి సంవత్సరం చేసిన విషయాన్ని మీకు గుర్తుండే ఉంటుందన్నారు.

 

అంతేకాకుండా..’అలాకాక మా ప్రభుత్వం గుర్తించిన 42 లక్షల మందికి మొదటి పంటకాలంలోనే రుణమాఫీ 2024 అమలు చేయడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.  వీరందరికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కావాల్సిన మొత్తం అంచనా 31 వేల కోట్లు. వీరిలో 2 లక్షలలోపు రుణాలు తీసుకొని కుటుంబ నిర్దారణ చేసిన ఖాతాల సంఖ్య 22,37,848.  రుణమాఫీ చేసిన మొత్తం 17933.19 వేల కోట్లు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే 2 లక్షలలోపు రుణాలను రుణమాఫీ చేశాము.  ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మిగతా 20 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిదే.  ఆర్థిక వెసులుబాటు చూసుకుంటు ఇది పూర్తి చేస్తాము.  పైన సంబంధించిన లెక్కలలో మీకేమైన అనుమానాలు ఉన్నట్లయితే బ్యాంకువారిగా మీరు కూడా పర్యటించి వివరాలు తీసుకోవచ్చు.  ఇంత పారదర్శకంగా లెక్కలు ఉన్నప్పటికి, రుణమాఫీ 2024 పథకం పూర్తి అయినట్లు, మేము ప్రకటించినట్లు మళ్ళీమళ్ళీ అవే అబద్దాలు చెప్పి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు.  తుమ్మలకి మంత్రిపదవులు కొత్తకాదు. మంత్రిపదవి కోసమో, ఇతర పదవులకు ఆశపడో మాట్లాడే నైజం తుమ్మలది కాదు.  గత నెలలో కురిసిన భారీ వర్షాలవలన రైతువారి జరిగిన నష్టం మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నివారణ కింద 10 వేల కోట్ల సహాయం ఆర్ధిస్తే కేవలం 400 కోట్లు మాత్రమే విధిల్చిన కేంద్ర ప్రభుత్వం, అక్కడ అధికారంలో ఉన్న బిజెపి పెద్దలను మీరేమన్నా ప్రశ్నించారా?

 

మీరు తెలంగాణలో మీ పరపతిని పెంచుకోవాలనుకుంటే, తెలంగాణకి వచ్చే నిధుల కోసమో, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రభుతంతరపున మీరు కూడా కేంద్ర ప్రభుత్వంపై పోరాడండి.  కేంద్ర ప్రభుత్వం వరికి ప్రకటించిన మద్ధతు ధర కంటే కూడా రూ.500 బోనస్ అధికంగా సన్న రకాలకు ప్రకటించి ఈ పంటకాలం నుంచే కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.  కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే దొడ్డు రకం రేషన్ బియ్యం ఎలా దుర్వినియోగం అవుతుందో మీకు తెలియంది కాదు.  ఈ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మా ప్రభుత్వం మీద 2000 కోట్లు అదనపు భారం పడిన కూడా సన్న బియ్యం సేకరించి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డు దారులకు , అన్ని వసతి గృహాల విద్యార్థులకు సరఫరా చేయడానికి ప్రణాళిక చేశాము.  కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య పథకం ఆరంభించినపుడు 37 లక్షలుగా ఉన్నది. అది గత వాయిదాలో 30 లక్షలకు కుదించడం జరిగింది.  ఈ లెక్క గురించి కూడా సమాధానం చెప్తే తెలంగాణ రైతాంగం హర్షిస్తుంది.  ఇప్పటికైనా బిజెపి రాష్ట్ర నాయకులు నా గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచిస్తున్నాను.’ అని మంత్రి తుమ్మల అన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • Minister Tummala Nageswara Rao
  • Runa Mafi
  • telugu news

తాజావార్తలు

  • 25 అప్‌డేట్లతో మార్కెట్‌లోకి Hyundai Verna.. ధర, ఫీచర్స్‌..

  • PV Sindhu: EBG ఫౌండేషన్ అంబాసిడర్‌గా పీవీ సింధు..

  • Shoaib Akhtar: పీసీబీ పరువు తీసిన షోయబ్ అక్తర్! భారత క్రికెట్ వ్యవస్థకు సలాం అంటూ షాకింగ్ కామెంట్స్..

  • Rajya Sabha Members : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఏకగ్రీవ ఎన్నిక పూర్తి..!

  • Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions