Minister Seethakka : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
- కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
- ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలి
- డిసెంబర్ తొలి వారంలో ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించిన వారోత్సవాలు జరగనున్నాయి : మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ తొలి వారంలో ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించిన వారోత్సవాలు జరగనున్నాయని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా వడ్డీ రహిత రుణాలు అందించే ప్రక్రియను మరింత చురుకుగా చేయాలని గ్రామ బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శనివారం, సచివాలయంలో డీఆర్డీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదు నెలల్లో చేపట్టాల్సిన పనులపై నివేదిక కోరారు. మార్చి నాటికి ఉపాధి హామీ పనుల కోసం రూ.1372 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్లు మంత్రి భరోసా ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ వంటి పథకాలకు సంబంధించి ఉపాధి నిధులు వినియోగించే చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. అయితే, క్షేత్ర స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించడం ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, గ్రామ సభలు తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాల ప్రకారమే ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల వేగాన్ని పెంచాలని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ రాజన్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ బీ షపీయుల్లా తదితరులు పాల్గొన్నారు.
Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!