Minister Seethakka : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
- కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
- ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలి
- డిసెంబర్ తొలి వారంలో ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించిన వారోత్సవాలు జరగనున్నాయి : మంత్రి సీతక్క
Minister Seethakka : కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ తొలి వారంలో ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించిన వారోత్సవాలు జరగనున్నాయని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా వడ్డీ రహిత రుణాలు అందించే ప్రక్రియను మరింత చురుకుగా చేయాలని గ్రామ బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శనివారం, సచివాలయంలో డీఆర్డీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదు నెలల్లో చేపట్టాల్సిన పనులపై నివేదిక కోరారు. మార్చి నాటికి ఉపాధి హామీ పనుల కోసం రూ.1372 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్లు మంత్రి భరోసా ఇచ్చారు.
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ వంటి పథకాలకు సంబంధించి ఉపాధి నిధులు వినియోగించే చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. అయితే, క్షేత్ర స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించడం ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, గ్రామ సభలు తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాల ప్రకారమే ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల వేగాన్ని పెంచాలని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ రాజన్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ బీ షపీయుల్లా తదితరులు పాల్గొన్నారు.
Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?
తాజావార్తలు
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?