Minister Seethakka : హత్యాచార బాధిత బాలిక కుటుంబానికి రూ.50 వేలు అందించిన మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఇటీవల మియాపూర్ లో హత్యాచారానికి గురికావడం తెలిసిందే. లక్ష్మ తండాకు చెందిన నరేశ్, శారద దంపతులు మూడు వారాల కిందట కూలి పనుల కోసం హైదరాబాద్ లోని మియాపూర్ వచ్చారు. వారి కుమార్తె (12) ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అదే వీధిలో ఓ చెత్త కుప్పలో ఆ బాలిక విగత జీవురాలిగా కనిపించింది. బాలికను అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో నేడు అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
బాలిక తల్లిదండ్రులకు రూ.50 వేల సాయం అందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. బాలిక కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా, ఆమె మియాపూర్ పోలీసులతో మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం