నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న ఈ ప్రాంతానికి ఏం చేయలేదని నష్టమే చేసింది కానీ ఏమి చేయలేదని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి కేంద్ర విశ్వవిద్యాలయం ఇస్తామని ఇవ్వలేదు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. తెరిపిస్తామన్న సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పటికీ తెరిపించలేదు అన్నారు మంత్రి సీతక్క. రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మార్చేసి బడుగు బలహీన వర్గాల పేదలను మరీ పేదలకు మార్చి ఆలోచనలు ఉన్నారని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకే మోడీ సపోర్ట్ ఇస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడక్కడ కొందరు మిల్లర్ల యాజమాన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అలా ఓవరాక్షన్ చేయకూడదని ఏమున్న కొనుగోలు కేంద్రం దగ్గరనే మాట్లాడి కానీ లారీలలో ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్లి కటింగ్ చేస్తున్నారని మా దృష్టికి వస్తే మా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెంటనే కలెక్టర్లకు కటింగ్ నిర్వహించే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. ఈ ఆకల వర్షానికి ధాన్యం తడిచిన పూర్తి మద్దతు ధర ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు.