Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గంవారికే పదవులు కట్టబెడతారని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.. మంత్రి అప్పలరాజుతో పాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు.. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన కొందరికి కనిపించడం లేదు.. కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇక, సమాజంలో రూపం మార్చుకున్న అంటరానితనాన్ని సీఎం వైఎస్ జగన్ అంతం చేశారని తెలిపారు అప్పలరాజు.. చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు ఇస్తారన్న ఆయన.. జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు అందనివ్వకుండా చంద్రబాబు చేశారని ఆరోపించారు. అప్పట్లో కలెక్టర్ల కు కూడా పథకాలు మంజూరు చేసే అధికారం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టని దౌర్బాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖ రాసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బీసీలే బుద్ధి చెబుతారు అంటూ జోస్యం చెప్పారు.. దళితులను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబును దళితులు గుర్తుపెట్టుకోవాలి సూచించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
Also Read
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట తప్పరని వైఎస్ జగన్ పై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా ఒకో కుటుంబానికి వేల రూపాయల మేర లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. కావలికి రామాయపట్నం పోర్టు రావడం ప్రజల అదృష్టం.. దీని ద్వారా కావలి కనక పట్నం కాబోతుందన్నారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బార్ ను త్వరలోనే సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!