Ponnam Prabhakar: రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారి కోసం మాత్రమే!
- మిస్ అయిన వారి కోసం మరో అవకాశం
- సర్వే గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ వారికి లేదు
- సర్వే తర్వాతనే ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం అని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది రీసర్వే కాదని, ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే అని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లోని మూడు పదవులలో ఒకటి బీసీకి కెటాయించే విధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు .
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం. మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం. ఇది రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ వ్యాపారస్థుల పార్టీ, వారికి రిజర్వేషన్లు ఇష్టం లేదు, కులగణనకి వారు వ్యతిరేకం. రిజర్వేషన్ల విషయంలో తాము వ్యతిరేకం అని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన పార్టీ బీజేపీ. ఎన్నికలు సర్వే తర్వాతనే జరుగుతాయి’ అని మంత్రి పొన్నం చెప్పారు.
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
Also Read: Himayatnagar Robbery: హిమాయత్ నగర్లో భారీ చోరీ.. రెండు కోట్ల రూపాయల నగలు మాయం!
‘ప్రజాస్వామ్యం మీద మీకు విశ్వాసం ఉంటే సర్వేలో పాల్గొనాలి. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేద ముస్లింలు చాల రోజుల నుండి బీసీలోనే ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేని ఎందుకు బయటపెట్టలేదు. బీఆర్ఎస్లోని మూడు పదవులు ఒక బీసీకి కెటాయించే విధంగా కల్వకుంట్ల కవిత గారు చర్యలు తీసుకోవాలి. కవితక్క మూడు పదవులలో బీసీలకి కెటాయించేలా కరీంనగర్ నుండే ఉద్యమం చేయాలి. రాహుల్ గాంధీ పర్యటన మీద దుష్ప్రాచారం చేయాలని చూస్తున్నారు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!