Ponguleti Srinivasa Reddy: నల్లగొండ జిల్లా నకిరేకల్ MPDO కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సన్న బియ్యంతో పాటు, అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంలో మేము వెనుకడుగు వేయము అని ఆయన పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
అలాగే భూభారతి చట్టంపై మాట్లాడిన మంత్రి.. ఇది గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, దేశానికే ఇది ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. జూన్ 2వ తేదీ నుంచి రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి భూ సమస్యలు పరిష్కరించనున్నారని వెల్లడించారు. అలాగే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పార్టీ, కులం, మతం అనే అర్హతలు అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్నారని, ఇక నుంచి జరగబోయే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఖాయం అని అన్నారు.