Minister Payyavula: కల్తీ నెయ్యి నిజం, అపచారం జరిగిందనేది నిజం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
- తిరుమల లడ్డూ వ్యవహారంపై మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు
- జగన్పై విరుచుకుపడిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: తిరుమల వ్యవహరం జగన్కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి నిజం.. లడ్డూల్లో వినియోగించింది నిజమని.. అపచారం జరిగిందనేది నిజమని ఆయన తెలిపారు. గతంలో ఉన్న లడ్డు నాణ్యతకు.. ఇప్పుడున్న లడ్డు నాణ్యత ఏంటని భక్తులని అడగండి.. వాస్తవాలు తేలుతాయన్నారు.
పాలకుడు మారాడు.. అందుకే తిరుమలలో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశమున్నా.. చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారన్నారు. వెంకన్న మీద జగనుకు నమ్మకం ఉన్నది నిజమైతే డిక్లరేషన్ మీద సంతకం చేయాలన్నారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నది చాలన్నారు. కమిటీ వేయడం మాత్రమే సీఎం చేస్తాడు.. టీటీడీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెబుతున్నారన్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Read Also: Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..
జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. టెండర్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని జగన్ ఒత్తిడి తీసుకు రాలేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. వైసీపీ హయాంలోని ఓ బోర్డు మెంబర్ నెయ్యి వ్యవహరంపై అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారన్నారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని నార్త్ ఇండియన్ మెంబర్ లేవనెత్తితే నాటి ఈవో ధర్మారెడ్డి, భూమన బుల్డోజ్ చేశారని విమర్శించారు. వెంకన్న సన్నిధిలో దోపిడీ చేస్తే శిక్ష తప్పదన్నారు. శిక్ష పడిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. దోపిడీ సొమ్ము అక్కడే ఉంటుంది.. కానీ దానిని అనుభవించ లేని అనారోగ్యం పరిస్థితుల్లోకి వెళ్తారన్నారు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి మాకేం అవసరమన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?