Minister Narayana: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం
- గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు
- ప్రజల ఆస్తిని కాపాడేందుకే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును తీసుకువచ్చామని వెల్లడి
Minister Narayana: వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. సెంటు భూమి నుంచి వేల ఎకరాల వరకూ వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. నెల్లూరు సిటీ నియోజగవర్గంలోని ఏసీ నగర్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆస్తిని కాపాడేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తి ఆస్తి లాక్కున్నా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా నాన్ బెయిల్ క్రింద 10 నుండి 14 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను నెల రోజుల్లో అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించే చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వీలైనంత త్వరగా భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పరిష్కరించలేకపోయిన సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయామో కూడా ప్రజలకు అధికారులు వివరించాలని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!