Nara Lokesh: ప్రతీ పెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పనిచేస్తా..
- రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పరిశీలిస్తానన్న మంత్రి నారా లోకేష్
- రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానన్న ఐటీ మంత్రి
- మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి.. మంగళగిరి ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: తాను ఇంకా చార్జ్ తీసుకోలేదు.. కానీ, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్.. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైసీపీ ముకలు గాయపరిచి దాష్టీకానికి గురి చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!
Also Read
- Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
- AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
- KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
అయితే, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయతో ఉండమని మమ్మల్ని కంట్రోల్ లో పెట్టారని.. అందుకోసం తాను మరియు శ్రేణులు నోరు మెదపడం లేదన్నారు మంత్రి నారా లోకేష్.. ఇక, రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరియు మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తాను స్వయంగా కోరానని.. ప్రణాలికాబద్ధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం అన్నారు. తాను ఇంకా చార్జి తీసుకోలేదని.. కానీ, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలించి.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా పనిచేస్తా.. మా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!