Nara Lokesh: ప్రతీ పెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పనిచేస్తా..
- రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పరిశీలిస్తానన్న మంత్రి నారా లోకేష్
- రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానన్న ఐటీ మంత్రి
- మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి.. మంగళగిరి ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: తాను ఇంకా చార్జ్ తీసుకోలేదు.. కానీ, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్.. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైసీపీ ముకలు గాయపరిచి దాష్టీకానికి గురి చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
అయితే, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయతో ఉండమని మమ్మల్ని కంట్రోల్ లో పెట్టారని.. అందుకోసం తాను మరియు శ్రేణులు నోరు మెదపడం లేదన్నారు మంత్రి నారా లోకేష్.. ఇక, రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరియు మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తాను స్వయంగా కోరానని.. ప్రణాలికాబద్ధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం అన్నారు. తాను ఇంకా చార్జి తీసుకోలేదని.. కానీ, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలించి.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా పనిచేస్తా.. మా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!