CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక
- విశాఖపట్నం కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష
- అభివృద్ధి ప్రణాళికపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విశాఖపట్నం కలెక్టరేట్లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆ అంశాలు ఏంటంటే..
1. జీరో పావర్టీ (అసమానతల తొలగింపు)
2. ఉద్యోగాల సృష్టి, కల్పన
3. నైపుణ్యత పెంపుదల
4. రైతు సాధికారత, ఆదాయం పెంపు
5. తాగు నీటి రక్షణ
6. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి
7. స్వచ్ఛ ఏపీ
8. మానవ వనరుల నిర్వహణ, వినియోగం
9. శక్తి వనరుల వినియోగం, నిర్వహణ
10. అన్ని రకాల సాంకేతిక జ్ఞానం పెంపుదల, పరిశోధన
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
Read Also: Tirupati Crime: లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్
పి.పి.పి. విధానం వల్ల సంపద సృష్టి జరిగిందని.. ఇప్పుడు పి – 4తో అవే ఫలితాలు సాధిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానానికి నాంది పలుకుదామన్నారు. రతన్ టాటా హబ్గా ఏపీ… ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్ దీదీలో భాగంగా ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.8 లక్షల సాయం – డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. భవిష్యత్తును అంచనా వేస్తూ కలెక్టర్లు, అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. మానవ వనరుల వినియోగంలో 2047 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఇండియా ఎదుగుతుందన్నారు. సంపద సృష్టికి… అభివృద్ధికి డబ్బు కన్నా… మంచి ఆలోచన ముఖ్యమన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై విశాఖపట్నంలో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
విశాఖ మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్రణాళిక, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్, రోడ్ల అనుసంధానం తదితర అభివృద్ధి పనుల్లో పి.పి.పి. విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అధికారులు హార్డ్ వర్క్ కాదు… స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. విశాఖలో పర్యాటకం అభివృద్ధికి పెద్ద పీట వేయాలన్నారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు వేసేందుకు ప్లాన్ చేయాలన్నారు. హైదరాబాద్ మాదిరిగా విశాఖ అభివృద్ధి చెందాలన్నారు. విశాఖ జనాభా ప్రస్తుతం సుమారు 26 లక్షలు ఉంది… ఉత్తరాంధ్ర జిల్లాలను అనుసంధానం చేస్తూ 50 లక్షలు, కోటి వరకు జనాభా పెరగాలన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం… 15 శాతం వృద్ధి సాధించే దిశగా సాగాలని సీఎం సూచించారు. 2025 లేదా 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే నాటికి అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి అయిపోవాలన్నారు. టాటా, జీ.ఎం.ఆర్.లాంటి సంస్థలను మెంటార్లుగా తీసుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!