Andhra Pradesh: వారిపై కేసులు ఎత్తివేయాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి.. సీఎం సానుకూల స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: సీఎం వైఎస్ జగన్ను కలిశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. 2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.. అయితే, దళిత సంఘాల వినతిని ఇవాళ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.. కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేసుల ఉపసంహరణకు సానుకూలంగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఇక, మీడియాతో మాట్లాడిన ఎంపీ నందిగం సురేష్.. 2017 లో MRPS నేతలు, కార్యకర్తలపై గత ప్రభుత్వం కేసులు పెట్టింది. కేసులు వల్ల చాలా మంది చదువు కున్న వారు ఇబ్బంది పడుతున్నారు.. వారి ఇబ్బందుల పై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. వీలైనంత త్వరగా కేసులు తీసేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చారు.. ఎప్పుడూ దళితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఏ నాయకుడు దళితుల సమస్యలు పట్టించుకోలేదు. దళితుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అన్న మాత్రమే అన్నారు ఎంపీ.. సీఎం ఢిల్లీ పర్యటనలో విభజన హామీల గురించి చర్చించారని కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్నారు ఎంపీ నందిగం సురేష్.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!